
Started With Rs 3000 this All Women Canteen Now Earns Rs 3 Crore Per Year
Shramik Mahila Vikas Sangh : సుమిత్ర సింఘే. తనది ముంబైలోని వసాయ్ ప్రాంతం. తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన భర్తను కోల్పోయింది సుమిత్ర. అప్పుడు తన కొడుకు 5 ఏళ్లు ఉంటాడు. తన భర్త చనిపోవడంతో.. డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయింది తనకు. ఎవ్వరూ సహాయం చేసేవాళ్లు లేరు. పనికోసం వెతుక్కుంటున్న సమయంలో.. తనకు శ్రామిక్ మహిళా వికాస్ సంఘ్ అనే ఓ సంస్థ గురించి తెలిసింది. ఆ సంస్థ మగదిక్కులేని, ఎటువంటి ఆధారం లేని సుమిత్ర లాంటి మహిళల కోసం ప్రారంభించిందే.
Started With Rs 3000 this All Women Canteen Now Earns Rs 3 Crore Per Year
కట్ చేస్తే.. ఇప్పుడు సుమిత్రకు 53 ఏళ్లు ఉంటాయి. ఇప్పుడు సుమిత్ర తన కాళ్ల మీద తాను నిలబడింది. తన కొడుకును మంచి చదువు చదివించగలిగింది. తన కొడుకుకు ఇప్పుడు 25 ఏళ్లు. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. తను ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఆ సంస్థే.
Started With Rs 3000 this All Women Canteen Now Earns Rs 3 Crore Per Year
1991లో ఒక ట్రస్ట్ గా ఏర్పడింది ఇది. ఇప్పటి వరకు సుమారు 300 మంది మహిళలకు ఉపాధిని చూపించింది ఈ సంస్థ. ముఖ్యంగా ఎటువంటి సంపాదన ఆధారం లేనివాళ్లు, మగదిక్కు లేని వాళ్లను చేరదీసి.. వాళ్లకు వంటకు సంబంధించిన నైపుణ్యాలను అందించి దాన్నే తమ వృత్తిగా ఎంచుకొని నాలుగు రాళ్లు సంపాదించుకునేలా చేసింది ఈ ట్రస్ట్.
Started With Rs 3000 this All Women Canteen Now Earns Rs 3 Crore Per Year
ఈ ట్రస్ట్ ను ఇందుమతి బార్వే అనే ఓ టీచర్ ప్రారంభించారు. ఆమెది కూడా వసాయ్ ప్రాంతమే. ఆమెతో పాటు.. తన ముగ్గురు ఫ్రెండ్స్ ఉష మనేరికర్, జయశ్రీ సామంత్, సుభదా కొత్తవాలె కూడా ఈ ట్రస్ట్ లో సభ్యులు. ఈ నలుగురు మహిళలు వివిధ రకాల వృత్తుల నుంచి వచ్చిన వాళ్లు. ఒకరు టీచర్, మరొకరు గృహిణి, ఇంకొకరు సోషల్ వర్కర్.. ఇలా.. రకరకాల బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. పేద మహిళలకు చేయందించడం కోసం రూపొందిందే ఈ ట్రస్ట్.
Started With Rs 3000 this All Women Canteen Now Earns Rs 3 Crore Per Year
నలుగురు మహిళలు కలిసి.. తమ వద్ద ఉన్న డబ్బును అంతా పోగేస్తే.. 3000 రూపాయలు అయ్యాయి. వాటితో ట్రస్ట్ ను ప్రారంభించారు. వీళ్లు ఏడుగురు పేద మహిళలను గుర్తించి.. వాళ్లతో పలు రకాల వంటలు వండించి.. వాటిని బస్ డ్రైవర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, వర్కింగ్ బ్యాచ్ లర్స్ లాంటి వాళ్లందరికీ పెట్టేవారు. అలా ప్రారంభమైన ఈ ట్రస్ట్.. 2021 సంవత్సరం వచ్చేసరికి 6 ఔట్ లెట్స్ కు చేరుకుంది. ప్రస్తుతం సంవత్సరానికి ఈ ట్రస్ట్ టర్నోవర్ 3 కోట్లు. ప్రస్తుతం ఈ సంస్థలో 175 మంది మహిళలు పనిచేస్తున్నారు.
వీళ్ల ఔట్ లెట్స్ ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రుల్లో ఉన్నాయి. అక్కడ తక్కువ ధరకే మంచి నాణ్యమైన ఫుడ్ ను వీళ్లు అందిస్తున్నారు. అన్నింటినీ లాభాల కోసమే కాకుండా.. కొన్ని సెంటర్లలో చాలా తక్కువ ధరకే ఫుడ్ ను అందిస్తున్నారు. ఏమాత్రం ఆధారం లేని మహిళలు కూడా ఈ సంస్థను నమ్ముకొని ఇప్పుడు సెటిల్ అయ్యారు. వాళ్లను నెలకు టైమ్ టు టైమ్ శాలరీలు అందుతాయి. అన్నీ పకడ్బందీగా ఉంటాయి. అందుకే.. చాలామంది పేద మహిళలు ఈ సంస్థలో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB…
Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…
Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…
pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…
Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
This website uses cookies.