2025 Amavasya Lucky Trees : జూన్లో జేష్ఠ అమావాస్య రోజున…. తప్పక ఈ మొక్కని నాటండి… సిరిసంపదలు, పూర్వీకుల ఆశీర్వాదం… తప్పక లభిస్తుంది…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 20 June 2025, 6:00 am
  •  2025 Amavasya Lucky Trees : జూన్లో జేష్ఠ అమావాస్య రోజున.... తప్పక ఈ మొక్కని నాటండి... సిరిసంపదలు, పూర్వీకుల ఆశీర్వాదం... తప్పక లభిస్తుంది...?

2025 Amavasya Lucky Trees : కొన్ని నెలలలో కొన్ని అమావాస్యలు వస్తూ ఉంటాయి. అయితే, అలాంటి అమావాస్యలు జేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకత కలిగినది. జేష్ట తిధిని పూర్వీకులకు అంకితం చేసినట్లుగా భావిస్తారు. అయితే,ఈ జూన్లో వచ్చే అమావాస్య రోజున, దానధర్మాలు, తర్పణం,చెట్ల పెంపకం ప్రత్యేక ఫలితాలను తెచ్చిపెడతాయి. అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇంకా,ఈరోజు కొన్ని ప్రత్యేకమైన మొక్కలని నాటితే, ఆ వ్యక్తులకి అదృష్టాన్ని, ప్రకాశవంతం చేయటమే కాదు,పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా పొందుతారని బలంగా నమ్ముతారు. ఎన్నో అమావాస్యలలో జేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నా పితృతర్పణం, ఉపవాసం, దానధర్మాలు ముఖ్యంగా, చెట్ల పెంపకానికి శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన మొక్కలు నాటితే,జీవితంలో ఆనందం, శ్రేయస్సు మాత్రమే కాదు పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని శాస్త్రంలో వివరించబడింది. జేష్ట అమావాస్య రోజున ఏ అద్భుతం మొక్కలను నాటాలో వాటికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత తెలుసుకుందాం…

2025 Amavasya Lucky Trees : జూన్లో జేష్ఠ అమావాస్య రోజున.... తప్పక ఈ మొక్కని నాటండి... సిరిసంపదలు, పూర్వీకుల ఆశీర్వాదం... తప్పక లభిస్తుంది...?

2025 Amavasya Lucky Trees : జూన్లో జేష్ఠ అమావాస్య రోజున…. తప్పక ఈ మొక్కని నాటండి… సిరిసంపదలు, పూర్వీకుల ఆశీర్వాదం… తప్పక లభిస్తుంది…?

2025 Amavasya Lucky Trees 2025 జేష్ఠ అమావాస్య ఎప్పుడు

తెలుగు పంచాంగం ప్రకారం జేష్ఠ మాసంలో అమావాస్య తిథి జూన్ 24వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఏ సమయంలో ఈ తిధి జూన్ 25న సాయంత్రం 4:02 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిధి ప్రకారం,జేష్ఠ అమావాస్య తిధి జూన్ 25 2025 బుధవారం రోజున జరుపుకుంటారు.

మీ విధిని మార్చే అద్భుత చెట్లు : అవిశ్వాసం ప్రకారం జేష్ఠ అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక మొక్కలు నాటితే చాలా శుభప్రదమని పండితులు తెలియజేస్తున్నారు. ఈ మొక్కలు మీ ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకురావడమే కాకుండా, పూర్వీకుల ఆశీర్వాదాలను కూడా మీపై ఉండేలా సహకరిస్తుంది.

రావి చెట్టు : రావి చెట్టు దైవిక వృక్షంగా భావిస్తారు. ( బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ) అందులో నివసిస్తారని నమ్ముతారు. జేష్ఠ అమావాస్య రోజున రావి చెట్టును నాటితే,పూర్వీకుల శాంతి చేకూరుతుంది.కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. రావి చెట్టు నాటడం వల్ల వ్యక్తికి దీర్ఘాయుష్యు లభిస్తుందని, అతని కష్టాలని తోలగిపోతాయని నమ్ముతారు.
మర్రి చెట్టు : హిందూమతంలో కూడా మర్రి చెట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంకా గౌరవించబడుతుంది. దీనిని కల్పవృక్షం లాగా భావిస్తారు. హిందూమత విశ్వాసాల ప్రకారం మర్రిచెట్టుని నాటితే కుటుంబం పెరుగుతుంది. ఇంట్లో శాంతి,ఆనందం కొనసాగ బడతాయి. ఈ చెట్లు దీర్ఘాయువు,శ్రేయస్ చిహ్నం, జేష్ఠ అమావాస్య రోజున ఈ చెట్టుని నాటితే, పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

వేప చెట్టు : వేప చెట్టు ఔషధ గుణాలతో నిండి ఉండే అద్భుతమైన చెట్టు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యతను ఇస్తారు. వేప చెట్టుని శనీశ్వరునికి, అంగారకునికి సంబంధించిందని నమ్ముతారు. అమావాస్య రోజు వేప చెట్టు నాటితే ఇంట్లో సానుకూల శక్తి కలుగుతుంది దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుంది పూర్వీకుల కూడా సంతోషపడతారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి