Achyutanada Das : శ్రీ అచ్యుతానంద దాస్ గారి 2024-2025 భవిష్యవాణి…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Updated on : 6 December 2023, 11:00 am
  •  Achyutanada Das : శ్రీ అచ్యుతానంద దాస్ గారి 2024-2025 భవిష్యవాణి...!

Achyutanada Das : ప్రాచీన కాలంలో బ్రహ్మంగారు చెప్పినట్టు అన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా.. బ్రహ్మంగారి కాలజ్ఞానం కాకుండా చరిత్రలో చాలామంది ఇలా భవిష్యత్తు గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా నోస్టాడమస్ బాబా బెంగాల్ అంటే గొప్ప వాళ్ళు చెప్పినట్టు ఇప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే స్వామి అచ్యుతానంద దాస్ గారు చెప్పిన భవిష్యమాలిక నూటికి నూరుపాళ్ళు జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. అయితే మీకు ఈరోజు స్వామి అద్భుతానంద దాస్ గారు చెప్పిన కొన్ని విషయాలు గురించి మనం తెలుసుకోబోతున్నాం.. దాస్ గారు చెప్పినట్టుగా ఒక యుగం నుంచి మరొక యుగానికి మా కార్యక్రమంలో భూమి మీద దాదాపు 7 రోజులపాటు చీకటి ఉంటుంది అని ఎవ్వరూ ఏమీ చూడలేరని ఎందుకంటే ఏదైనా యుగం ముగియబోతున్నప్పుడు లేదా యుగంలో మార్పు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పారు.

త్రేతా యుగంలో లాగా హనుమంతుడు ఎప్పుడైతే సంజీవని మూలికను సేకరించడానికి వెళ్ళా డో అప్పుడు భూమిపై ఏడు రోజులు చీకటి ఏర్పడిందంట. అదేవిధంగా సత్యాయుగంలో కూడా మొరాసురనే రాక్షసుడు మొత్తం విధ్వంసం సృష్టించి దేవరాజైన ఇంద్రుని ఓడించినప్పుడు అప్పుడు కూడా భూమ్మీద ఏడు రోజుల చీకటి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు రాబోయే 2024 మరియు 2029 సంవత్సరాల మధ్య మరొక్కసారి జరుగుతుందని ఈ సమయంలో ఎవరైతే మహా అక్షర మంత్రాన్ని జపిస్తారో వారు ఈ చీకటిలో కూడా చూడగలరని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో భూమి యొక్క దూరంలో చాలా మార్పు ఉంటుందని భూమికి చంద్రుడికి ఉన్న దూరం కూడా తగ్గుతుందని రాయబడింది. ఇలా జరగటం వల్ల భూమి మీద ఉష్ణోగ్రతల్లో వేగవంతమైన మార్పులకు దానివల్ల సగం గ్రహం చాలా వేడిగా ఉంటుంది. మరియు మిగిలిన సగం చాలా చల్లగా ఉంటుంది. సముద్రమట్టం చాలా వేగంగా పెరుగుతుంది.

అలాగే సముద్ర తీరంలో ఉన్న నగరాలు దేశాలు ఆ నీళ్లలో మునిగిపోతాయి. అలాగే ఇప్పుడు సముద్రం ఉన్నచోట ఎడారి ఏర్పడవచ్చు. ఎడారి ఉన్నచోట మరొక మార్పు జరగొచ్చు. అక్కడ కొత్త సముద్రం ఏర్పడిన ఆశ్చర్యపోనవసరం లేదు. యుద్ధం ప్రకృతి వైపరీత్యాల కారణంగా భూమి పై భాగం పూర్తిగా నిర్మానుష్యంగా మారుతుందని ఇందులో రాసారు. ఇక్కడ ఇక రాబోయే రోజుల్లో పంటలు పండవు.. భవిష్యత్తులో సౌర మంటలు భూమిని నాశనం చేస్తాయని కూడా రాశారు. ఈ సౌర మంటలు సూర్యుడి నుండి అకస్మాత్తుగా విడుదలవుతాయి. దీనివల్ల ఇప్పటి వరకు మనం చూడని అత్యంత శక్తివంతమైన పేలుళ్లు సంభవిస్తాయి. ఇవి ఎన్నో రెట్లు శక్తివంతమైనవి బిలియన్ల హైడ్రోజన్ బాంబులతో సమానమైన శక్తిని ఇవి విడుదల చేస్తాయి. సౌర మంటల కారణంగా భూమ్మీద ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయటం ఆగిపోతాయి. మీకు తెలుసా 1989లో సోలార్ ఫెయిల్యూర్ కారణంగా కెనడాలోని క్యూబిక్ ప్రాబ్లమ్స్ లో 9 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రమాదకరమైన పేలుళ్లు సంభవించాయి.. చూసారు కదా ఇది రాబోయే కాలంలో అచ్యుతానంద గారు చెప్పినవి ఎంత నేర్పు జరుగుతాయో చూడాలి.

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp