Shravana Amavasya : ఈరోజే శక్తివంతమైన శ్రావణ అమావాస్య.. కొడుకులు ఉన్నవారు రాత్రి 9 గంటల లోపు ఈ ఒక్క పరిహారం చేసి తీరాల్సిందే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shravana Amavasya : ఈరోజే శక్తివంతమైన శ్రావణ అమావాస్య.. కొడుకులు ఉన్నవారు రాత్రి 9 గంటల లోపు ఈ ఒక్క పరిహారం చేసి తీరాల్సిందే…

Shravana Amavasya  : ఈ రోజే అధిక శ్రావణ అమావాస్య. కొడుకులు ఉన్నవారు రాత్రి తొమ్మిది గంటలలోపుఈ యొక్క పరిహారం చేసి తీరాల్సిందే.. మరి శక్తివంతమైన అధిక శ్రావణ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి. మరి ఆ పరిహారాలు ఎవరెవరు చేసుకోవాలి. అనే విశేషాలను మనం తెలుసుకుందాం.. అసలు ఈ పరిహారం ఎందుకు చేసుకోవాలి. కొడుకులు ఉన్నవారి పరిహారం చేయడం వల్ల కొడుకుల జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. ఎలా చేయాలి. ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2023,9:00 pm

Shravana Amavasya  : ఈ రోజే అధిక శ్రావణ అమావాస్య. కొడుకులు ఉన్నవారు రాత్రి తొమ్మిది గంటలలోపుఈ యొక్క పరిహారం చేసి తీరాల్సిందే.. మరి శక్తివంతమైన అధిక శ్రావణ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి. మరి ఆ పరిహారాలు ఎవరెవరు చేసుకోవాలి. అనే విశేషాలను మనం తెలుసుకుందాం.. అసలు ఈ పరిహారం ఎందుకు చేసుకోవాలి. కొడుకులు ఉన్నవారి పరిహారం చేయడం వల్ల కొడుకుల జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. ఎలా చేయాలి. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఎక్కువ శాతం కొడుకులకి ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాకుండా ఆ కొడుకుల కోసం ఎన్నో రకాల పూజలు, వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. మన తల్లిదండ్రులు మరి అలాంటిది ఈ అధిక శ్రావణ అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున కొడుకుల కోసం ఈ పరిహారాన్ని చేస్తే ఈ కొడుకుల యొక్క జీవితంలో తల్లి ప్రేమతో చేసేటువంటి ఎలాంటి పూజలు వ్రతాలు నోములు అయినా సరే పిల్లలకు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. మరి అలాంటి తల్లి ప్రేమతో అమావాస్య రోజున రాత్రి 9 గంటల లోపు ఈ పరిహారాన్ని చేస్తే కనుక ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేవి చూస్తారు. బిడ్డల జీవితాల్లో ఊహించని మార్పు అనేది చోటు చేసుకుంటుంది. మరి ఇంతకు ఆ పరిహారం ఏంటి అంటే ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు రాత్రి 9 గంటల లోపు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారం కోసం ఎక్కువగా ఏమీ అవసరం లేదు. మనం ఈ పరిహారాలు చేసుకోవడానికి 11 రావి ఆకుల్ని తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో గాని లేదా మీ ఇంటి దగ్గర ఏవైనా రావి చెట్లు ఉంటే నేల మీద కింద రాలి పడిపోయినటువంటి 11 రావి ఆకుల్ని ఇంటికి తీసుకువచ్చి చక్కగా శుభ్రం చేసుకుని పసుపు నీటితో ఆ రావి ఆకుల్ని చక్కగా శుభ్రం చేసుకుని పసుపు నీటితో ఆ రావి ఆకుల మీద గంధం బొట్టు చక్కగా కుంకుమ బొట్టు అద్ది ర ఐదు పోచల దారాన్ని కూడా పోసుకొని ఈ దారం గుమ్మానికి కట్టుకోవడానికి వీలుగా ఉన్నంత పెద్దగా దారాన్ని పోసలుగా పోసుకోవాలి.

దీన్ని గంధం నీళ్లలోనూ అలాగే గంధం కుంకుమ వేసినటువంటి నీళ్లలో కనుక తడిపి దాన్ని చక్కగా పసుపుపచ్చగా అయిన తర్వాత ఆ రావి ఆకుల్ని ఒక్కొక్క దాన్ని ముడి వేసుకుంటూ రావాలి. ఈ ముడి వేస్తున్న సందర్భంలో మీకు ఎంతమంది కొడుకులు ఉంటే వారి పేర్లను ఒక్కొక్కటిగా తలుచుకుంటూ ఈ రావి ఆకుల్ని తోరంలా కట్టుకోవాలి. అలా 11 రావి ఆకుల్ని ఇలా చక్కగా తోరల్లా కట్టుకున్నాక లక్ష్మీదేవి పూజలో దాన్ని పెట్టాలి. పూజ అయిపోయిన అనంతరం రాత్రి 9 గంటల లోపు ఈ గుమ్మానికి తోరంలా కట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ తోరంలా కట్టే అంతసేపు కూడా మీ పిల్లల పేర్లు ఎంతమంది ఉంటే అంతమంది మగ పిల్లల పేర్లు తలుచుకుంటూనే ఉండాలి.

ఇలా చేస్తే ఉద్యోగరీత్యా వారు పడుతున్నటువంటి మానసిక సంఘర్షణలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీమహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా మీ బిడ్డలపై నిత్యం ఎల్లవేళలా ఉంటుంది. ఈ రావి ఆకుల్లో శ్రీమహావిష్ణువు ఉన్న కారణాల ఆ మహావిష్ణువు అనుగ్రహం కూడా బిడ్డలపై ఉంటుంది. కాబట్టి ఇలా తక్షణమే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది