Brahmam Gari Kalagnanam వణుకు పుట్టిస్తున్న కాలజ్ఞానం 2024 మొదట్లో… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brahmam Gari Kalagnanam వణుకు పుట్టిస్తున్న కాలజ్ఞానం 2024 మొదట్లో…

Brahmam Gari Kalagnanam  : బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పుడు వణుకు పుట్టిస్తుంది. సాధారణంగా కాలజ్ఞానం అనగానే మనకి గుర్తొచ్చేటువంటి అంశాలు ఏంటి గతంలో జరిగిన అనేక అంశాలని ముందుగానే ఊహించి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తాళపత్ర గ్రంధాల రూపంలో కాలజ్ఞానం పేరుతో భద్రపరిచి ఉంచారు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగిన ఎలాంటి ఆశ్చర్యకర సంఘటన జరిగిన ఏం జరిగినా సరే దాని యొక్క ప్రస్తావన కాలజ్ఞానంలో ఉండటం మనం చూస్తున్నాం.. ఇప్పటికే అనేక అంశాలు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :30 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  వణుకు పుట్టిస్తున్న కాలజ్ఞానం 2024 మొదట్లో

  •  Brahmam Gari Kalagnanam In 2024 Starting

  •  2024 లో ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం కచ్చితంగా భయపడక తప్పదు

Brahmam Gari Kalagnanam  : బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పుడు వణుకు పుట్టిస్తుంది. సాధారణంగా కాలజ్ఞానం అనగానే మనకి గుర్తొచ్చేటువంటి అంశాలు ఏంటి గతంలో జరిగిన అనేక అంశాలని ముందుగానే ఊహించి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తాళపత్ర గ్రంధాల రూపంలో కాలజ్ఞానం పేరుతో భద్రపరిచి ఉంచారు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగిన ఎలాంటి ఆశ్చర్యకర సంఘటన జరిగిన ఏం జరిగినా సరే దాని యొక్క ప్రస్తావన కాలజ్ఞానంలో ఉండటం మనం చూస్తున్నాం.. ఇప్పటికే అనేక అంశాలు ఈ ప్రపంచంలో జరిగినవి కాలజ్ఞానంలో పొందుపరచబడిన అంశాలు తాజాగా జరుగుతున్న అనేక పరిణామాలు కూడా ఎప్పుడో వందలు క్రితం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానంలో పొందుపరిచారు. అలాగే కరోనా దగ్గర నుంచి మొదలుపెడితే ఈ ప్రపంచంలో జరిగిన ఎన్నో అంశాలని వీరబ్రహ్మేంద్రస్వామి వారి ముందుగానే ఊహించారు. అయితే ఈ 2024వ సంవత్సరంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాము..

2024 లో ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం కచ్చితంగా భయపడక తప్పదు.. కాలజ్ఞానాన్ని రాసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో భవిష్యత్తును ఊహించి ముందుగానే మనకు చెప్పినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మన తెలుగు ప్రజలకి ఎంతో సుపరిచితమైనటువంటి వ్యక్తి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. వారు ఈయన కాలజ్ఞానం రూపం లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పారు తాళపత్ర గ్రంథాల రూపంలో పొందుపరిచారు. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో గరిమిరెడ్డి, అచ్చం రెడ్డి అనే వాళ్ళింట్లో పశువుల కాపరిగా పనిచేసేవారు. ఈయన పశువుల మేపటానికని దగ్గరలో ఉన్నటువంటి రవ్వల కొండకి వెళ్లేవారు. పశువుల చుట్టూ గీత గీసి అవి ఎక్కడికి వెళ్లి పోకుండా ఒక పక్క కాపలా కాస్తూనే మరొకపక్క కాలజ్ఞాన రచన చేశారని మన చరిత్ర చెబుతోంది. కాబట్టి ఇప్పుడు ఆ కొండలని బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తున్నారు..ముందుగానే కాలజ్ఞానంలో రాశారు. కృష్ణమ్మ దుర్గమ్మ జలవిపత్తు గనక సంభవిస్తే కృష్ణా నదికి వరదలు. వస్తే నాగార్జునసాగర్ డ్యాంకి ప్రమాదం వాటిలితే దుర్గమ్మ ముక్కు పడుకుని కృష్ణమ్మ అందుకోవటం పెద్ద కష్టం కాదు. అలాంటి విపత్తులు గనుక వస్తే ఈ ప్రపంచం అన్న కల్లోలం ఉండటం ఖాయం. రాబోయే రోజుల్లో ఇది తప్పక జరుగుతుందని కాలజ్ఞానంలో ఆయన రాశారు.

ప్రముఖ దైవ క్షేత్రం శ్రీశైలం పర్వతంపై ముసలి సంచరిస్తుందని ఆ ముసలి ఎనిమిది రోజులు ఉండి బ్రమరాంబ గుడిలో చేరి మేకపోతు లాగా అరిచి మాయమైపోతుంది అన్నారు. అధికంగా డబ్బు సంపాదించిన వారు తిరిగి దనహీనులై దరిద్రులు అయిపోతారని, ఇత్తడి బంగారమవుతుందని వివాహాల్లో కుల గోత్రానికి పట్టింపులు ఉండవని రాశారు. అయితే రాబోయే రోజుల్లో వ్యాపారం ధర్మబద్ధంగా చేయాలనుకునే వారే కనుమరుగైపోతారని ధనాజనేజయంగా ప్రజలు జీవిస్తారని ఆయన రాశారు. ప్రపంచంలో నదులు ఉప్పొంగుతాయని వరదలు బీభత్సం సృష్టిస్తాయని జల ప్రవాహాలు ముంచిత్తుతాయని 14 నగరాలు మునిగిపోతాయని రాశారు. అలాగే కలియుగంలో 5000 సంవత్సరాల పూర్తయిన తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని రాశారు. చెన్నకేశవస్వామి మహిమలు నాశనం అయిపోతాయని. వేప చెట్టు నుండి అమృతం కారుతోందని.. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జననిష్టం జరుగుతుందని రాశారు. అలాగే 2032వ సంవత్సరంలోపు ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి కంట కన్నీరు, స్థలాల నుండి పాలు కారుతాయని రాశారు. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్యక్షేత్రంలో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని చెప్పారు. వచ్చిన ఆపద పోయిందని అందరూ సంతోషిస్తున్న సమయంలో తిరిగి అనేక విభక్తులు ప్రజలని అల్లకల్లోలం చేస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కానీ ప్రపంచంలో ఇంకా కొత్తగా ఎన్ని వైరస్లు పుట్టుకొచ్చి విశ్వం మొత్తం నాశనం అవుతుందని చెప్పారు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది