365 Vattulu : 365 వత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ తప్పులు చేస్తే మహా పాపం అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిందే…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: October 28, 2022, 6:00 am

365 Vattulu : కార్తీకమాసంలో 365 వత్తులు వెలిగిస్తున్నార.. కార్తీక మాసంలో 360 ఒత్తులు వెలిగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి.? పాటించవలసిన నియమాలు ఏంటి.. ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి. ఇవన్నీ కూడా మీరు వివరంగా తెలుసుకుందాం. ఈ మాసంలో ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలుగుతూ ఉంటాయి. శివాలయాల్లో దీపోత్సవం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా శివాలయంలో దీపాన్ని ఈ కార్తీకమాసంలో వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం అలాగే కార్తీకమాసంలో ప్రత్యేకమైన రోజులలో కార్తీక సోమవారం అలాగే ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో 360 ఒత్తుని వెలిగిస్తూ ఉంటారు. ఈ 361 వెలిగించడం వల్ల ఎంతో శ్రేయస్సు అలాగే ఎంతో పుణ్యం కలుగుతుందని నమ్ముతుంటారు సంవత్సరం పొడుగునా పూజలు చేయడానికి కుదరలేని వాళ్ళు ఈ రోజుల్లో 365 వంతు వెలిగిస్తే సంవత్సరం పొడుగునా పూజ చేసిన అంత ఫలితం దక్కుతుందని నమ్ముతూ ఉంటారు. అలాగే పండితులు కూడా దీన్నే సూచిస్తున్నారు.దీప దానం చేయడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుంది.

దేవుడు ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ విషయాన్ని విష్ణువు స్వయంగా బ్రహ్మకు చెప్పాడు. మహారాజు చెప్పడం గురించి మత గ్రంథాలు ప్రస్తావనలు ఉన్నాయి. అలాగే ఈ మాసంలో దీప దానం చేయాలి. ఈ విధంగా ఏ కారణం చేతనైనా ఒక దీపం ఇవ్వవద్దు. జోడి దీపాలతో పసుపు కుంకుమను వేసి నెయ్యి వేసి దీపాన్ని దానం ఇవ్వాలి.. అత్యంత పవిత్రమైన మాసమని నమ్ముతూ ఉంటారు. ఆది శివ కేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసమిది ఆధ్యాత్మిక ఆపరంగా ఆరోగ్యప్రదమైన మాసం దీపం జ్యోతి మహేశ్వరః దీపాన్ని సర్వం సంధ్య దీపం నమోస్తుతే అని భావిస్తారు ఉదయం తెల్లవారుజామున స్థానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. రాగి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సర్వరోగాలు దోషాలు నశిస్తాయి. స్టీల్ కుందులో దీపారాధన వస్తున్న చేయకూడదు దీపారాధన సమయంలో ప్రమిదల్లో నూనె పోసిన తర్వాతనే ఒత్తులు వేసి వెలిగించాలి.ప్రమిదల్లోని వత్తులు అగ్గిపుల్లతో వెలిగించడం కన్నా ముందుగా ఏక హారతిలో కర్పూరం వెలిగించి కర్పూరంతో వత్తులను వెలిగించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

Do you 365 Vattulu candles in the Karthika masam

Do you 365 Vattulu candles in the Karthika masam

దీపారాధన చేసేందుకు సెనగ నూనెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు దీపారాధన అస్సలు చేయకూడదు. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని విశ్వాసం అమ్మవారి ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుదిలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు సంపాదన పెరుగుతుంది. కార్తిక మాసంలో ప్రత్యేకంగా ప్రత్యేకమైన రోజుల్లో 365 వొత్తును వెలిగిస్తూ ఉంటారు. కానీ కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లు వల్ల వాళ్లకి వెలిగించిన ఫలితం అయితే దక్కదు పైగా ఇంకా పాపం చుట్టుగుంటుంది. 365 వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.. 365 ఒత్తులను సంవత్సరం పొడుగునా మనం దీపారాధన చేయకపోతే 365 వత్తులను కార్తీక మాసంలో ఏదైనా విశేషమైన రోజున వెలిగిస్తే అంతే పుణ్యఫలం లభిస్తుందని మన పండితులు సూచిస్తున్నారు. ఈ 365 ఒత్తుని ఇంట్లో కాని తులసి కోట దగ్గర గాని దేవాలయంలో వెలిగిస్తుంటారు. ఈ 360 వత్తులను మనమే స్వయంగా తయారు చేసుకోవాలి.ఇలా చేసిన తర్వాత ఆవు నేతిలో వాటిని మనం ఉదయం వెలిగించుకున్నాం అనుకుంటే సాయంత్రం వేళలోనే ఆవు నెయ్యిలో వాటిని ముంచాలి.

అలాగా వెలిగించిన 365 వొత్తుని తులసి కోట దగ్గర కానీ లేకపోతే దగ్గర్లో ఉన్న దేవాలయంలో ఎక్కడైనా శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిది.. పసుపు కుంకుమ అక్షంతలని ఆ పద్మములో వేయాలి వేసిన తర్వాత తమలపాకు మీద పసుపు విఘ్నేశ్వరుని చేయాలి. పసుపు గణపతి ముందు మరొక ఆవు నేతితో దీపాన్ని తప్పనిసరిగా వెలిగించుకోవాలి. పసుపు కుంకుమ అక్షంతలతో గణపతిని పూజించి తర్వాత అగురుతులు వెలిగించి దీపాన్ని చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత హారతి కర్పూరం ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకొని ప్రదక్షిణలు చేసి ఇక వినాయకుని పూజ ముగించాలి. ఇలా వినాయకుని పూజ అయిపోయిన తర్వాత మరొక పక్క 365 వంతుకి సిద్ధం చేసుకోవాలి. ఒక తమలపాకు తీసుకొని దానిమీద కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వెయ్యాలి. వేసిన తర్వాత మట్టి ప్రమిదని తీసుకోవాలి. తర్వాత 361 మట్టి ప్రమిదలో ఒత్తులు పెట్టిన తర్వాత దానిమీద చిన్న కర్పూరం ఉంచండి.అలా కర్పూరం బిళ్ళను ఉంచితే దాన్ని వెలిగిస్తే అది ఎటువంటి ఆటంకాలు లేకుండా దీపం వెలుగుతూ ఉంటుంది.

ఇలా 365 సిద్ధం చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతో దీపాన్ని పూజించండి తర్వాత ఏక హారతితో కానీ అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. అలా 361 వెలిగించిన తర్వాత దానికి కూడా ధూపాన్ని చూపించాలి. ధూపాన్ని చూపించి బెల్లం ముక్కని కానీ కొబ్బరికాయ, అరటి పళ్ళు, చలిమిడి, పానకం ఇలాంటివి నైవేద్యంగా 360 ఒత్తికి మనం నైవేద్యంగా సమర్పించుకోవాలి. తర్వాత హారతినివ్వాలి. మంత్రపుష్పం చెప్పుకోవాలి. ఇక సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత 365తో వెలిగించేటప్పుడు ఓం నమశ్శివాయని కానీ కార్తీక దామోదరాయ నమః అని చెప్పి శివ కేశవరెడ్డి కూడా తలుచుకుంటూ దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ఉన్నంత సేపు కూడా కార్తీక పురాణం చదివితే ఎంతో పుణ్యఫలం. తెలిసి తెలియక తప్పులు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం. కాబట్టి 365 వెలిగించేటప్పుడు ఈ నియమాల్ని తప్పనిసరిగా పాటించాలి. కొంతమంది రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో 365 మాత్రమే వెలిగిస్తుంటారు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా 365 ఓతుని తప్పనిసరిగా వెలిగించుకోవాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp