Lakshmi Devi : 2024 జనవరి 1 రోజున మహిళలు ఈ రంగు చీర కట్టుకుంటే రాజయోగం పడుతుంది…!!

 Authored By jyothi | The Telugu News | Updated on :1 January 2024,7:00 am

Lakshmi Devi : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ప్రజలంతా కూడా ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అంటే వారి యొక్క జీవితంలో నూతన వెలుగులు నిండాలని ఇక మీదైనా ఈ సమస్య అయినా వారి జీవితంలో శుభ ఘడియలు రావాలని ఆర్థికంగా పురోగతి రావాలని వారికున్న కష్టాల నుండి వారికి విముక్తి కలగాలని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా పాత సంవత్సరంలో ఎటువంటి కష్టాలు అయితే అనుభవించారో ఇక నూతన సంవత్సరములు అయినటువంటి కష్టాలు ఉండకూడదని అందరు కూడా నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తెలుగు మాసాల ప్రకారం చూసినట్లయితే గనక మనం ఉగాది నుండి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఈ కొత్త సంవత్సరంలో జనవరి 1న పంచమి రోజున వరాహి దేవి వ్రతం చేసుకోవచ్చు. ఇంకా పంచమి తిది లో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయటం వరాహి దేవిని పూజించడం ద్వారా కూడా కార్యసిద్ధి కలుగుతుంది.

అయితే 5రకాల నూనెలను కలగలిపి వరాహి దేవికి దీపం వెలిగిస్తే కనుక సకల సంపదలు కలుగుతాయి.ఈ దీపానికి ఎరుపు రంగు వత్తులు వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినప్పప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, సెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు. ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి సోమవారం రోజు పంచమి రోజు జనవరి 1వ తేదీ వచ్చింది. కాబట్టి ఈ జనవరి ఒకటవ తేదీన స్త్రీలు ధరించి చీర రంగు విషయంలో కూడా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. ఎందుకంటే ఈ రోజున కనుక స్త్రీలు ఈ రంగు చీరలు ధరిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి..భర్తకు ఆ సమస్య అంతా కూడా ఐశ్వర్య యోగం అనేది కనిపిస్తుంది. అంటే మీ భర్త చేస్తున్న పని అది వ్యాపారం కావచ్చు. ఉద్యోగం కావచ్చు.. వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. వారికి ఉన్న ఇబ్బందులు వారి యొక్క వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే స్త్రీలు ధరించాల్సిన రంగు చీర ఏమిటి అంటే.. కనుక ఎరుపు రంగు కావచ్చు.. లేకపోతే నారింజ కావచ్చు.. అంటే ఈ రంగు చీరలు కానీ లేకపోతే దుస్తులను కానీ నూతన సంవత్సరం రోజున జనవరి ఒకటవ తేదీన సోమవారం పంచమి ధరిస్తే మీకు సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఉంటాయి.

ముఖ్యంగా నూతన వస్త్రాలను ధరించడమే నూతన సంవత్సరం రోజు ఎంతో ముఖ్యం అంటే నూతన సంవత్సరం అంతా కూడా కొత్త బట్టలు ధరించగలుగుతాం. అంటే అంతగా గణనీయమైన పురోగతి ఆర్థిక అభివృద్ధి అనేది మన యొక్క జీవితంలో ఉంటుంది. కాబట్టి నూతన వస్త్రాలు పసుపు రంగు కానీ లేకపోతే ఎరుపు రంగు కానీ ధరిస్తే శుభ ఫలితాలుగా మారుతాయి. అలాగే సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఆర్థిక పురోగతిని సొంతం చేసుకుంటారు. ఎరుపు రంగు కానీ గాజులు ధరించడం ఈ సమయంలో మీకు శుభకరం. సోమవారం పంచమి తిని రోజు కాబట్టి ఆ రోజున మీరు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీ పూజ మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నైవేద్యాలతో ఆ భగవంతుని ఆరాధించి ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు కూడా దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి. అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి..

jyothi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి