Maha Shivaratri : బిల్వపత్రం శివునికి ఎందుకు ఇష్టం...? అసలు వీటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి..?
Maha Shivaratri : మన తెలుగు సాంప్రదాయాలలో మహాశివరాత్రి పండుగ హిందూ ధర్మంలో ముఖ్యమైన పండుగ. ఈ మహాశివరాత్రి రోజున భక్తులు విశేషంగా శివునికి భక్తితో పూజలు చేస్తారు. ఇంకా శివయ్యకు వివిధ రకాల సమర్పణలు కూడా చేస్తారు. అందులో ముఖ్యమైనది మారేడు ఆకులు ( బిల్వపత్రాలు) శివుని పూజలో విటికీ ప్రత్యేక స్థానం ఉంది. ఇంకా శివునికి ఎంతో ప్రీతికరమైన పత్రాలు. అయితే పురాణాలు తెలిపేది ఏమిటంటే మారేడు ఆకులను సమర్పించడం శుభప్రదం అని, పాపా విమోచనానికి దారితీస్తుందని నమ్ముతారు. మన హిందూ ధర్మంలో మారేడు వృక్షం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీనికి గల పవిత్రత కారణంగా శివుని పూజలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకులు బత్తిని సూచిస్తాయి మరియు శివుడు వాటిని ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడని ఏ భక్తులు ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతారు.
Maha Shivaratri : బిల్వపత్రం శివునికి ఎందుకు ఇష్టం…? అసలు వీటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి..?
బిల్వపత్రమునకు ఆ పేరు మూడు ఆకులను కలిగి ఉండడం వలన బిల్వపత్రం లేదా త్రీఫల పత్రం అని కూడా అంటారు. ఈ మూడు ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని హిందూ ధర్మం చెబుతుంది. ఈ సమతుల్యత శివుని అనుగ్రహం పొందేందుకు సహాయపడుతుందని భక్తులు విశ్వాసం.
లక్ష్మీదేవి, మారేడు వృక్షం : పురాణాలలో, స్కంద పురాణం, శివపురాణం వంటి ప్రాచీన గ్రంధాలు మారేడు ఆకులు ప్రాముఖ్యతను సూచిస్తుంది. భక్తితో సమర్పించిన ఒక్క బిల్వపత్రం కూడా అపారమైన శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నాయి పురాణాలు. శివునికి ఏది లేకపోయినా ఒక్క మారేడు పత్రం సమర్పించినా చాలు శివయ్య కటాక్షంతో విశేష ఫలితాలను భక్తులకు ఇస్తాడు అని పురాణాలు తెలియజేస్తున్నాయి.
ఆధ్యాత్మిక శక్తి : ఈ త్రిఫల పత్రాలు ఆధ్యాత్మిక శక్తిని మన జీవితంలో ప్రతికూలశక్తులను కూడా తొలగిస్తుందని నమ్ముతారు. వీటిని సమర్పించడం వల్ల పాప క్షయానికి దారితీస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ బిల్వపత్రాలు సమర్పించడం వల్ల భక్తులకు మోక్షమార్గం సులభం అవుతుందని విశ్వసిస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు : మరి ఆరోగ్యపరంగా చూస్తే విలువ వృక్షం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టు ఆకులు, గింజలు ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. శరీరంలోని మలిన పదార్థాలను తొలగించడానికి లేదా విశాలను తొలగించడానికి సహాయపడుతుంది. విలువ ఆకులు శరీరాన్ని శుభ్రపరచడమే కాదు మానసిక శాంతిని కూడా ఇస్తుంది.
శివరాత్రికి ప్రత్యేకత : మహాశివరాత్రి రోజున ముఖ్యంగా మారేడు ఆకులు అనగా విలువ పత్రాలను శివునికి సమర్పించితే సంతోషిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున శివునికి మారేడు ఆకులు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తే భక్తులకు ఇష్టకార్యాలు నెరవేరుతాయి అని నమ్ముతారు. భక్తులకూ తమ కుటుంబంలో, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తిని పొందే ఎందుకో శివున్ని ఆరాధిస్తారు.
అయితే మారేడు ఆకులతో శివుడిని పూజలో అత్యంత ముఖ్యమైన సమర్పణలో ఒకటిగా మారాయి. మత్తులో మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం, మారేడు ఆకులను సమర్పించడం టీవీ చేయడం వల్ల శివుని యొక్క అనుగ్రహం పొందుతారు. శివునికి మారేడు దళం అంటే చాలా ఇష్టం. ఒక్క మారేడు దళాన్ని శివునికి సమర్పిస్తే మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.