Margashirsha Purnima : మార్గశిర పూర్ణిమ రోజున ఇలాచేసి చూడండి…. 32 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది…..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Margashirsha Purnima : మార్గశిర పూర్ణిమ రోజున ఇలాచేసి చూడండి…. 32 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది…..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 December 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Margashirsha Purnima : మార్గశిర పూర్ణిమ రోజున ఇలాచేసి చూడండి.... 32 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది.....!

Margashirsha Purnima : సనాతన హిందూ ధర్మం లో సంవత్సరం పొడవునా పండగలు ఉపవాసాలు ఉంటాయి. అయితే మార్గశిర మాసంలో వచ్చే పూర్ణిమ నాడు చాలా ముఖ్యమైన, పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. పూర్ణిమ ఉపవాసం ప్రత్యేకత కలిగి ఉంటుంది. పూర్ణిమ రోజున ఉపవాసం చేసినచో సానుకూల శక్తిని మరియు శ్రేయస్సును తెస్తుంది. మార్గశిర మాసంలో పూర్ణిమ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి చంద్రుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కనుక భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ మార్గశిర పూర్ణిమ రోజున చేసే దానాలు,మంచి పనులు, మంచి ఫలితాన్ని ఇస్తాయని,ఇతర పౌర్ణమి రోజు కంటే 32 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని కలిగి ఉంటాయంట. అంటే మార్గశిర పూర్ణిమ నాడు ఉపవాసం చేస్తే 32 పూర్ణిమ సమయాల్లో ఉపవాసం చేయటం వల్ల వచ్చే సమానమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

Margashirsha Purnima మార్గశిర పూర్ణిమ రోజున ఇలాచేసి చూడండి 32 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది

Margashirsha Purnima : మార్గశిర పూర్ణిమ రోజున ఇలాచేసి చూడండి…. 32 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది…..!

Margashirsha Purnima మార్గశిర పూర్ణిమ ఎప్పుడు

ఈ సంవత్సరం మార్గశిర పూర్ణిమ తిధి డిసెంబర్ 14 సాయంత్రం4:58 నిమిషాలకు ప్రారంభమై… డిసెంబర్ 15న మధ్యాహ్నం 2:31 గంటలకు పూర్ణిమ తిధి ముగుస్తుంది. ఈ క్రమంలో మార్గశిర పూర్ణిమను ఆదివారం నాడు జరుపుకుంటారు.

Margashirsha Purnima మార్గశిర పూర్ణిమ పూజా విధానం

ఈ మార్గశిర పూర్ణిమ రోజున ఉపవాస దీక్ష పాటించాలంటే బ్రహ్మ ముహూర్తంలోని నిద్రలేచి స్థానాన్ని ఆచరించాలి. ఈరోజు నా పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజు నా గంగా స్థానం చేస్తే విష్ణువు,లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని గట్టిగా నమ్ముతారు. అలాగే తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు.
– మార్గశిర పూర్ణిమ రోజున పసుపు రంగు దుస్తులను ధరించి పూజా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి. విష్ణు లక్ష్మీదేవి లను పాదామృతంతో అభిషేకం చేసి ఆ తర్వాత ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించండి.

– లక్ష్మీదేవికి,ఎర్రచందనం ఎర్రని పూలతో అలంకారాలు సమర్పించండి.
– లక్ష్మీనారాయణ ల ముందు నెయ్యి దీపమును వెలిగించి ఈ రోజంతా ఉపవాసం ఉంటానని మనసులో స్మరించుకోండి.
– పూర్ణిమ వ్రత కథ, శ్రీ లక్ష్మి సూక్తం పఠించండి .
– శ్రీమహావిష్ణువుకి హారతిని, స్వామికి పాయసమును సమర్పించండి.
– చంద్రోదయ సమయంలో నైవేద్యాలను చంద్రునికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల అన్ని దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
– మార్గశిర పూర్ణిమ రోజున జాగారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, అలా చేయలేకపోతే రాత్రి విష్ణు విగ్రహం దగ్గర నేలపై పడుకోండి.ఈ మంత్రాలను జపించండి :
– ఓం

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది