
Sita Ramulu : సీత రాములు నిద్రించిన ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..?ఆ ప్రదేశం ఇదే..!!
Sita Ramulu : మన భారతదేశం యొక్క గొప్ప ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. తింటే గారెలే తినాలి. వింటే రామాయణమే వినాలి. అన్నట్టుగా రామాయణం గురించి ఆయోగ పురుషుడు రాముడు గురించి ఎంత విన్న ఎన్నిసార్లు విన్న.. తనివి తీరదు.. ఇక రామాయణం గురించి అందులో చెప్పబడిన సంఘటన గురించి మన దేశంలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలామంది రామాయణం అంటే రాముడి జననం, సీతారాముల కళ్యాణం, సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం, సీతాపుహరణం రావణ పద్ధతి అయోధ్య రాక రాముడి పట్టాభిషేకం వీటి గురించి ఆలోచిస్తారు. కానీ ఇక ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి ఎవరు ఎక్కువ ఆలోచించరు.. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సీతారాములు నిద్రించిన ప్రదేశాన్ని ఎవరు చూసి ఉండరు.. ఆ ప్రదేశం ఎక్కడుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో రామ సముద్రం గ్రామానికి ఓ పెద్ద చరిత్ర ఉన్నది ఆ రామసముద్రంలో ఉన్న భావి దగ్గర సీతారాములు నిద్రించారని అక్కడే స్నానాలు ఆచరించారని గ్రామంలో ఉన్న పెద్దలు చెప్పడం జరిగింది. ఒకరోజు సీత రాములు వేటకు వెళ్లేటప్పుడు రామసముద్రం అనే ఊరి దగ్గరికి వచ్చేసరికి చీకటి అవడంతో ఆ గ్రామం నుండి వెళ్లాలనుకున్న రాత్రివేళ సమయంలో వెళ్లడం ఎందుకని రామసముద్రం గ్రామంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో సీతమ్మకు దాహం వేయడంతో రామున్ని సీతమ్మ నాకు దాహం వేస్తుంది అని చెప్పింది. అప్పుడు చుట్టుపక్కలంతా ఎక్కడ చూసినా నీరు లేకపోవడంతో రాముడు తన చేతిలో ఉన్న బాణంతో ఒక్కసారిగా భూమిలోకి బాణం వేశాడు.అప్పుడు అక్కడ నీరు ప్రవహించింది.. అని రామసముద్రం పెద్దలు చెప్తున్నారు. రామసముద్రం ప్రాంతానికి చెందిన రైతు చెంచయ్య కొన్ని విషయాలను తెలియజేశారు. అక్కడి ప్రజలందరూ నమ్మకంగా సీతారాములు అక్కడే నిద్రించారు.
అదేవిధంగా ఆ బావిలో ఉన్న నీరుతో స్నానాలు ఆచరించడం వలన రోగాలు పోతాయని నమ్ముతూ ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా సరే పాము కరిచిన తేలు కరిచిన ఇప్పటికి మరణించిన వారు లేరని అంత చరిత్ర గల ఊరు అని ఓ పెద్దాయన తెలియజేశారు.. సీతారాములు అక్కడే నిద్రించారని ఇక అప్పటి నుంచి ఆ గ్రామానికి అనారోగ్య సమస్యలు ఉన్నవారు వచ్చి నిద్ర చేసేవారట. అక్కడే స్నానాలను ఆచరించి వెళ్లేవారట.. పిల్లలు లేనివారు అక్కడ స్నానాలు ఆచరించినట్లయితే పిల్లలు పుట్టే వారిని చెంచయ్య తెలియజేయడం జరిగింది.. అయితే ఆ బావి దగ్గర మైనార్టీకి చెందిన ముస్తఫా అనే ఒక వ్యక్తి ఆ భావి దగ్గరే ఉండేవాడట.. అక్కడికి వచ్చిన వారందరికీ తాయితలు వేస్తూ.. మంత్రాలు జపిస్తూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరినీ బాగు చేస్తూ ఉండేవారట.. పూర్వకాలంలో ఒకతను మరణిస్తే వారిని మళ్లీ తిరిగి ప్రాణం పోసినట్టు రామసముద్రంలో గ్రామ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు..
Peddi Movie Public Talk : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…
Rohini Reddy : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు రోహిణి రెడ్డి. జబర్దస్త్, బిగ్బాస్,…
LPG Gas : దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్…
Rainbow Fruits and Vegetables : ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పండ్లు, కూరగాయలు తినడం మాత్రమే సరిపోదు. వాటిలోని రంగుల…
Ajwain Water : మన వంటింట్లో సులభంగా లభించే వాము (Ajwain) కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే కాదు,…
Tirumala Laddu : లియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీవారి లడ్డూ…
Peddi Movie Review : ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ బ్లాక్బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram…
Ram Charan Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’…
Peddi Movie ": మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’…
Peddi Movie Part 2 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా, బుచ్చిబాబు సానా…
Peddi Movie Review Live Updates : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన భారీ…
Telangana Land Registration : తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన…
This website uses cookies.