Sita Ramulu : సీత రాములు నిద్రించిన ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..?ఆ ప్రదేశం ఇదే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sita Ramulu : సీత రాములు నిద్రించిన ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..?ఆ ప్రదేశం ఇదే..!!

 Authored By aruna | The Telugu News | Updated on :19 January 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Sita Ramulu : సీత రాములు నిద్రించిన ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..?ఆ ప్రదేశం ఇదే..!!

Sita Ramulu : మన భారతదేశం యొక్క గొప్ప ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. తింటే గారెలే తినాలి. వింటే రామాయణమే వినాలి. అన్నట్టుగా రామాయణం గురించి ఆయోగ పురుషుడు రాముడు గురించి ఎంత విన్న ఎన్నిసార్లు విన్న.. తనివి తీరదు.. ఇక రామాయణం గురించి అందులో చెప్పబడిన సంఘటన గురించి మన దేశంలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలామంది రామాయణం అంటే రాముడి జననం, సీతారాముల కళ్యాణం, సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం, సీతాపుహరణం రావణ పద్ధతి అయోధ్య రాక రాముడి పట్టాభిషేకం వీటి గురించి ఆలోచిస్తారు. కానీ ఇక ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి ఎవరు ఎక్కువ ఆలోచించరు.. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సీతారాములు నిద్రించిన ప్రదేశాన్ని ఎవరు చూసి ఉండరు.. ఆ ప్రదేశం ఎక్కడుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో రామ సముద్రం గ్రామానికి ఓ పెద్ద చరిత్ర ఉన్నది ఆ రామసముద్రంలో ఉన్న భావి దగ్గర సీతారాములు నిద్రించారని అక్కడే స్నానాలు ఆచరించారని గ్రామంలో ఉన్న పెద్దలు చెప్పడం జరిగింది. ఒకరోజు సీత రాములు వేటకు వెళ్లేటప్పుడు రామసముద్రం అనే ఊరి దగ్గరికి వచ్చేసరికి చీకటి అవడంతో ఆ గ్రామం నుండి వెళ్లాలనుకున్న రాత్రివేళ సమయంలో వెళ్లడం ఎందుకని రామసముద్రం గ్రామంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో సీతమ్మకు దాహం వేయడంతో రామున్ని సీతమ్మ నాకు దాహం వేస్తుంది అని చెప్పింది. అప్పుడు చుట్టుపక్కలంతా ఎక్కడ చూసినా నీరు లేకపోవడంతో రాముడు తన చేతిలో ఉన్న బాణంతో ఒక్కసారిగా భూమిలోకి బాణం వేశాడు.అప్పుడు అక్కడ నీరు ప్రవహించింది.. అని రామసముద్రం పెద్దలు చెప్తున్నారు. రామసముద్రం ప్రాంతానికి చెందిన రైతు చెంచయ్య కొన్ని విషయాలను తెలియజేశారు. అక్కడి ప్రజలందరూ నమ్మకంగా సీతారాములు అక్కడే నిద్రించారు.

అదేవిధంగా ఆ బావిలో ఉన్న నీరుతో స్నానాలు ఆచరించడం వలన రోగాలు పోతాయని నమ్ముతూ ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా సరే పాము కరిచిన తేలు కరిచిన ఇప్పటికి మరణించిన వారు లేరని అంత చరిత్ర గల ఊరు అని ఓ పెద్దాయన తెలియజేశారు.. సీతారాములు అక్కడే నిద్రించారని ఇక అప్పటి నుంచి ఆ గ్రామానికి అనారోగ్య సమస్యలు ఉన్నవారు వచ్చి నిద్ర చేసేవారట. అక్కడే స్నానాలను ఆచరించి వెళ్లేవారట.. పిల్లలు లేనివారు అక్కడ స్నానాలు ఆచరించినట్లయితే పిల్లలు పుట్టే వారిని చెంచయ్య తెలియజేయడం జరిగింది.. అయితే ఆ బావి దగ్గర మైనార్టీకి చెందిన ముస్తఫా అనే ఒక వ్యక్తి ఆ భావి దగ్గరే ఉండేవాడట.. అక్కడికి వచ్చిన వారందరికీ తాయితలు వేస్తూ.. మంత్రాలు జపిస్తూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరినీ బాగు చేస్తూ ఉండేవారట.. పూర్వకాలంలో ఒకతను మరణిస్తే వారిని మళ్లీ తిరిగి ప్రాణం పోసినట్టు రామసముద్రంలో గ్రామ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది