Kalagnanam : సాక్షాత్తు దైవ స్వరూపుడైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగంలో జరగబోయే వింతలను, భవిష్యత్తును తన మనోనేత్రంతో దర్శిస్తూ కాలజ్ఞానాన్ని రచించారు. ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పినవన్నీ చాలా వరకు జరిగాయి. మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. బ్రాహ్మణులు తమ కులవృత్తులను వదిలి ఇతర కర్మలను చేపడతారు. దీని వలన కలియుగమంతా అల్లకల్లోలంగా మారుతుంది. కాశీ నగరాన్ని కొన్ని రోజులపాటు మూసివేస్తారు. 1910-12 మధ్యలో గంగా నదికి వరదలు వచ్చినప్పుడు కలరా వ్యాధి వ్యాపించింది. దాంతో కాశిని చాలా రోజుల వరకు దర్శించలేదు. తాజాగా 2020 లో కరోనా వలన మరోసారి ఆలయం మూత పడింది.
సృష్టికి ప్రతి సృష్టి చేయాలంటూ అనేక రకాల యంత్రాలను తయారు చేస్తారు. అవయవాలను అమరుస్తారు. అయితే చావుని తప్పించే యంత్రాన్ని మాత్రం కనిపెట్టలేరు. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకొని ఎక్కువగా మరణిస్తారు. కంచి కామాక్షి దేవత కంటి వెంట నీరు కారుతుంది. అనంతరం వేలాదిమంది మరణిస్తారు. కృష్ణ గోదావరి మధ్య మహాదేవుడు అన్నవాడు జన్మించి అన్ని మతాలను సమానంగా చూస్తూ గుళ్ళు గోపురాలు నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతలు పొందుతాడు. మహిళలు నడత తప్పుతారు. వావి వరుసలు మాయం అవుతాయి. కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకని తాకుతుంది. రాజులు బిచ్చగాళ్లు అవుతారు. బిచ్చగాళ్లు ధనవంతులవుతారు. వ్యాపారం నీతిగా చేయాలనుకునేవారు కరువు అవుతారు. ధన ఆశతో జీవితాన్ని సాగిస్తారు.
అడవి జంతువులు పట్టణాలు పల్లెల్లో తిరుగుతాయి. అడవులు అరణ్యాలలో మంటలు ఏర్పడి రోజుల తరబడి మండుతాయి. కృష్ణానది మధ్యలో రథం కనబడుతుంది. రధం చూసిన వారి కళ్ళు పోతాయి. రెండు బంగారు హంసలు భూమి మీద తిరుగుతాయి. అత్యాశతో వాటిని పట్టుకోవాలనుకునేవారు నాశనం అవుతారు. శ్రీశైలం పర్వతం పై మొసలి సంచరిస్తుంది. ఆ మొసలి ఎనిమిది రోజులు ఉండి బ్రమరాంబ గుడిలో చేరి మేకలా అరిచి మాయమవుతుంది. తూర్పు దేశమంతా నవ నాగరికత పేరుతో విచ్చలవిడితనం పెరుగుతుంది. వివాహాల్లో కుల గోత్రాల పట్టింపులు లను వదులుతారు. ప్రపంచంలో నదులు పొంగుతాయి. వరదలు బీభత్సం సృష్టిస్తాయి. జల ప్రవాహాల వలన 14 నగరాలు మునిగిపోతాయి. ఆనంద నామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనలు కనబడతాయి అన్నారు. ఇలా జరిగిన సమయంలో తాను మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా జన్మిస్తానని వీర బ్రహ్మంగారు చెప్పారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.