జిల్లాలోని గొల్లప్రోలులో పౌష్టికాహార మహోత్సవంలో భాగంగా గొల్లప్రోలు పరిధిలోని సాయిబాబా కల్యాణమండపంలో సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు హాజరయ్యారు. ఐసీడీఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అంగన్ వాడీ టీచర్లు, వైసీపీ నాయకులు హాజరైన ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు పెండెం దొరబాబు మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచన మేరకు ఆహారపదార్థాలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యం విషయమై సందేహాలను అంగన్ వాడీ టీచర్లు, వైద్య శాఖ సిబ్బందితో పాటు వైద్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గర్భిణులకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు పెట్టారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా ఈ సామగ్రిని గర్భిణులకు అందజేసి, సీమంత కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు పరిధిలోని గర్భిణులు పాల్గొన్నారు.
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
This website uses cookies.