
A heorine left doing duet songs because of Sr NTR
SR NTR : తెలుగు సినిమా ప్రస్తావన వస్తే అందులో ఎన్టీఆర్ పేరు తప్పక ఉంటుంది. ఓ వైపు పౌరాణిక చిత్రాల్లో నటిస్తూ వెండితెర దేవుడిగా వెలుగొందినా.. మరోవైపు మాస్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలుగించినా అది ఒక్క ఎన్టీఆర్కే దక్కింది కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు నందమూరి తారకరామరావు. తెలుగు ప్రజలు ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ అనే పేరు వినిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ ఈ లోకాన్ని వదిలి వెళ్లి 25 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఆయన వలన ఓ హీరోయిన్ డ్యూయెట్ సాంగ్కి దూరం కావలసి వచ్చిందట. వెండతెరపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ మొత్తం 302 సినిమాల్లో నటించారు. వీటిలో ఏకంగా 275 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. సినిమా ఇండస్ట్రీలో ఆయన నటనకు ప్రత్యేకమైన గుర్తింపు లభించడమే కాకుండా, సినీ ఇండస్ట్రీ ని తారస్థాయికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ తెలుగు లోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళం ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇప్పటికే అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో ఒక రాముడు, కృష్ణుడిగా నిలిచిపోయారు. అయితే ఎన్టీఆర్ సినిమాలు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదట. ఆయన సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి యూనిట్ అంతా కలిసి పండగ చేసుకునే వారట.. అయితే ఓ షూటింగ్ సమయంలో తన అందచందాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న వాణిశ్రీ సీనియర్ ఎన్టీఆర్ వల్ల డ్యూయట్స్ కి దూరం అయిందట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. సీనియర్ ఎన్టీఆర్ వాణిశ్రీ కలిసి చాలా సినిమాల్లో నటించారు.. ఇందులో బంపర్ హిట్ కొట్టిన మూవీ ఎదురులేని మనిషి. ఈ సినిమాని అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేయగా .. వాణిశ్రీ తన నటనతో అదరగొట్టింది. కానీ మూవీలో ఒక పాటను షూటింగ్ చేస్తుండగా వాణిశ్రీ చాలా ఇబ్బంది పడిందని, కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఆమెకు నచ్చలేదని, దీంతో ఈ విషయాన్ని ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్ళిందట.
A heorine left doing duet songs because of Sr NTR
ఈ విషయంలో సాయం చేయాలని ఎన్టీఆర్ ని వాణిశ్రీ కోరింది. అయితే ఎన్టీఆర్ మాత్రం తాను ఏమీ చెప్పలేనని, వాళ్లు డబ్బులు పెట్టి సినిమా తీస్తారు కాబట్టి వారు చెప్పినట్లే చేయాలని అదే ట్రెండ్ నడుస్తోందని అన్నారట. దీంతో వాణిశ్రీ ఏం చేయలేక ఇబ్బందితో ఆ చిత్రంలోని పాటలను పూర్తి చేసిందని తెలుస్తోంది . దీని తర్వాత తాను చేసే ఏ సినిమాలో అయినా డ్యూయట్ సాంగ్స్ చేయబోనని ముందే చెప్పిందట వాణి శ్రీ.ఆ విధంగా ముందు కండీషన్ పెట్టిన తర్వాతే సినిమా ఒప్పుకునేదని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ మాత్రం పరోక్షంగా కారణమయ్యారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన సెట్లో ఉంటే ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరి రోజు షూటింగ్ పూర్తి కాగానే అన్న గారితో కలిసి హీరో హీరోయిన్ లను ప్రత్యేకంగా పిలిపించుకుని పండుగ చేసుకునే వారట.
ఆ సమయంలో ఏ సినిమా అయినా షూటింగ్ పూర్తయ్యే సమయానికి అందరినీ పిలిచి విందు ఇవ్వడం జెమిని, వాహిని స్టూడియో నిర్మాతలకు ఒక ఆనవాయితి. తమిళనాట సినిమారంగంలో ఈ ఆనవాయితీ ఇప్పుడు కూడా నడుస్తోంది. ఇక అన్నగారి సినిమాల్లో మాత్రం సావిత్రి హీరోయిన్ గా ఎక్కువ నటించేవారు. ఆమె భోజన ప్రియురాలు. మరీ ముఖ్యంగా మాంసాహారం అంటే ఎక్కువగా ఇష్టపడేదట. ఎన్టీఆర్ కి కూడా మాంసాహారం అంటే చాలా ఇష్టం.. ఎన్టీఆర్ తో పాటుగా నటీనటులకు కూడా పీతలు, రొయ్యలు, చేపల పులుసు తో పాటు నాటు కోడి ఇంకా రెండు మూడు రకాల ఆహార పదార్ధాలు చేయించి తెచ్చే వారని తెలుస్తోంది. ఈ సంప్రదాయాన్ని శారదా కొన్నాళ్లు పాటించారు… దీని తర్వాత వాణిశ్రీ కొనసాగించారు. వాణిశ్రీ కూడా ఎన్టీఆర్ కొరకు రకరకాల వంటకాలు వండి తెచ్చి సెట్లో ఆయనకు పెట్టేవారట.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నిర్మలమ్మ కూడా ఈ ఆనవాయితీని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే.
Vijay wife Sankgeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా ఉన్న…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
This website uses cookies.