
Anchor Rashmi Gautam About Animals ni champadam
Rashmi Gautam : యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం బుల్లితెరపై ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అనసూయ కూడా ఈటీవీ నుంచి వెళ్లిపోవడంతో రష్మీకి మరింత చాన్సులు వస్తున్నాయి. ఇటు సుధీర్ వెళ్లిపోవడం, అటు అనసూయ వెళ్లిపోవడంతో రష్మీకి బాగానే కలిసి వచ్చింది. సుధీర్ బయటకు వెళ్లడంతో శ్రీదేవీ డ్రామా కంపెనీకి రష్మీ యాంకర్గా మారింది. ఇటు అనసూయ వెళ్లిపోవడంతో జబర్దస్త్ షోకు యాంకర్గా మారింది రష్మీ. అలా మొత్తానికి ఈ మూడు షోల్లోనూ ఇప్పుడు రష్మీనే కనిపించబోతోంది. ఇలా రష్మీ గౌతమ్ బుల్లితెరపై ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్కు అందుబాటులోనే ఉంటుంది. ఫ్యాన్స్ చేసే కామెంట్స్, తన పేరిట చేసే సేవా కార్యక్రమాల మీద స్పందిస్తుంది.
మరీ ముఖ్యంగా రష్మీ మూగ జీవాల పట్ల మక్కువ చూపిస్తుంటుంది. రష్మీ జంతు ప్రేమికురాలన్న సంగతి అందరికీ తెలిసిందే. రష్మీ చేసే మంచి పనులు, మూగ జీవాల పరిరక్షణకు చేసే పనులు, పడే తాపత్రయంతో అందరి అభిమానాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు అంటూ మూగ జీవాలను బలి ఇవ్వడాన్ని రష్మీ వ్యతిరేకిస్తుంది. అది బక్రీద్ అయినా దసరా అయినా ఇలా ఏ పండుగ అయినా ఏ మతానికి సంబంధించిన ఆచారమైనా కూడా రష్మీ వ్యతిరేకిస్తుంటుంది. సంక్రాంతి కోళ్ల పందెలైనా సరే వ్యతిరేకిస్తుంది. ఇక పెట్స్ సంరక్షణ కోసం రష్మీ ముందుంటుంది.
Anchor Rashmi Gautam About Animals ni champadam
వీధుల్లో గాయపడిన పెట్స్ను తెచ్చి కాపాడుతుంది. ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తుంటుంది. అలాంటి రష్మీ తాజాగా ఓ నెటిజన్ వేసిన పోస్ట్ మీద ఘాటుగా స్పందించింది. ఓ జంతువును బలి ఇస్తున్న ఫోటోను రష్మీకి ట్యాగ్ చేశాడు. దీనిపై రష్మీ స్పందించింది. ఇలా కేవలం నాకు ట్యాగ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మీ డీటైల్స్.. అది జరిగిన ప్లేస్, దాని డీటైల్స్ పంపిస్తేనే నేను ఏమైనా చేయగలను.. మీరు కూడా ఈ పోరాటానికి సిద్దంగా ఉండాలి అంటూ నెటిజన్కు సూచించింది.
Anchor Rashmi Gautam About Animals ni champadam
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.