Actress Laya : పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చిన నటి లయ.. ఆమె పక్కనున్న వ్యక్తి ఎవరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actress Laya : పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చిన నటి లయ.. ఆమె పక్కనున్న వ్యక్తి ఎవరో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :13 March 2023,9:40 am

Actress Laya : సీనియర్ నటి లయ తెలుసు కదా. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తన గురించే చర్చ. చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. లయ అంటే ఈ జనరేషన్ యూత్ కు తెలియకపోవచ్చు కానీ.. 80స్, 90స్ కిడ్స్ కి లయ సుపరిచితమే. అప్పట్లో లయ స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు 5 ఏళ్ల పాటు అందరు స్టార్ హీరోల సరసన నటించి అలరించింది లయ.

Actress Laya Visit Tirumala Temple First Time After Marriage

Actress Laya Visit Tirumala Temple First Time After Marriage

ఆ తర్వాత సడెన్ గా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. పెళ్లి చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది. కొన్ని నెలల కిందనే భారత్ కు వచ్చిన లయ.. మళ్లీ ఇండస్ట్రీలో తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మధ్య తను ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే తన పర్సనల్, సినిమా లైఫ్ కు సంబంధించిన చాలా విషయాలను ఆమె షేర్ చేసుకుంది. ఇక.. లయ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

Actress Laya Visit Tirumala Temple First Time After Marriage

Actress Laya Visit Tirumala Temple First Time After Marriage

Actress Laya : తిరుమలలో లయను చూసి ఎగబడ్డ భక్తులు

తనకు పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత తొలిసారి లయ తిరుమలను దర్శించుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి లయ తిరుమలను దర్శించుకుంది. తిరుమలలో లయను చూసిన భక్తులు… ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఆ తర్వాత ఆమె మీడియాతో కాసేపు మాట్లాడారు. ఆమె వెంట తన కుటుంబ సభ్యులు ఉన్నారు. తిరుమలలో లయకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది