Liger : లైగర్ తర్వాత బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ చేయబోతున్న పూరి జగన్నాధ్..!

Authored By vamana sai | The Telugu News | Published on: March 1, 2021, 6:30 pm

Liger : లైగర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో శరవేగంగా సాగుతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని మేకర్స్ ఇటీవలే పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లైగర్ లో హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి పెట్టిన సాలా క్రాస్ బ్రీడ్ అన్న ట్యాగ్ తో పూరి మార్క్ సినిమా అని అందరూ ఫిక్సైపోయారు.

after-liger-puri-jagannadh-is-going-to-make-block-buster-sequel

after-liger-puri-jagannadh-is-going-to-make-block-buster-sequel

ఇక ఈ సినిమా గురించి ఇటు టాలీవుడ్ .. అటు బాలీవుడ్ జనాలందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాధ్ నుంచి రాబోతున్న సినిమా కావడం తో ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ కి లైగర్ తో భారీ హిట్ ఇస్తాడని అందరూ నమ్మకంగా చెపుకుంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్ బ్యారస్ పై కరణ్ జోహార్, పూరి జగన్నాధ్ – ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Liger : లైగర్ తర్వాత రామ్, పూరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఆ సినిమానే ఇస్మార్ట్ శంకర్. రామ్, పూరి కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇద్దరికి మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో రామ్ కి మాస్ హీరో ఇమేజ్ విపరీతంగా వచ్చేసింది. వాస్తవంగా ఇస్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించి సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా ఈ సీక్వెల్ పెండిగ్ పడి ఇద్దరు వేరే వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యారు. అయితే లైగర్ తర్వాత రామ్, పూరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp