Rajinikanth : రజినీకాంత్ తరవాత వందలాది కోట్ల ఆస్తి ‘ వాళ్ళకే ‘ భారీ నిర్ణయం తీసుకున్న రజినీకాంత్

 Authored By sekhar | The Telugu News | Updated on :30 May 2023,9:00 am

Rajinikanth : సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యమంత్రి అయ్యేంత క్రేజ్ ఆయనకి ఉంది. ఈ క్రమంలో తమిళనాడులో గత సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయి… రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి మళ్లీ యు టర్న్ తీసుకుని ఇప్పుడు యధావిధిగా సినిమాలు చేస్తున్నారు. వయసు మీద పడినా గాని రజిని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బస్ కండక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రజినీకాంత్ ప్రస్తుతం తమిళ సినిమా రంగంలో నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలుతున్నారు.

After Rajinikanth, hundreds of crores of property belong to them

After Rajinikanth, hundreds of crores of property belong to them

కొన్ని వందల కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్నారు. ఇప్పటికీ దక్షిణాది సినిమా రంగంలో రజిని చక్రం తిప్పుతున్నాడు అనటంలో ఆశ్చర్యం లేదు. పరిస్థితి ఇలా ఉంటే రజినీకాంత్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే జనరల్ గా సెలబ్రిటీ ఆస్తులు తమ వారసులకు చెందాలని వీలునామ రాస్తారు. అయితే రజిని మాత్రం ఈ విషయంలో చాలా విభిన్నంగా ఆలోచించారు. మేటర్ లోకి వెళ్తే రజనీకాంత్ కి ఇద్దరు కూతుర్లు అని అందరికీ తెలుసు. ఆయనకి కొన్ని వందల వేల కోట్ల… ప్రాపర్టీ ఉన్నాయి.

ఈ క్రమంలో ఇద్దరు కూతుర్లకు ఆల్రెడీ సగం ఆస్తి రాసి ఇవ్వడం జరిగిందంట. ఇంకా మిగతా సగం వాటా పేద ప్రజలకు చెందాలని తాజాగా తన వీలునామాలో రజిని రాయడం జరిగింది అంట. ఈ విషయంపై కూతుర్లు కూడా అడ్డు చెప్పకపోవడం గమనార్హం. రజిని తీసుకున్న ఈ నిర్ణయానికి కుటుంబం కూడా అంగీకరించటం జరిగిందంట. దీంతో వయస్సు ఇంత మీద పడినా గాని… తాజాగా సినిమాకి చేస్తున్న డబ్బులు పేదలకు ఉపయోగపడతాయని రజిని కష్టపడుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి