chiranjeevi acts with anasuya
Anasuya: గత కొంత కాలంగా యాంకర్ కం నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ బాగా పెరిగిపోతోంది. బుల్లితెర మీద పాపులారిటీ వల్ల సినిమాలలో అవకాశాలు అందుకున్న ఆమె చేసే ప్రతీ పాత్రతో బాగా మెప్పిస్తుంది. బుల్లితెర మీద షో నవ్వుతూ..అవసరానికి తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే ఇంతకన్నా ఈమె ఏం చేస్తుందిలే అనుకున్నారు. అంతేకాదు గుంటూరు టాకీస్ సినిమాలో యాంకర్ రష్మీ హీరోయిన్గా మారింది. ఈ సినిమాలో రష్మీ బోల్డ్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇక రష్మీకీ టాలీవుడ్లో తిరుగుండదు. ఇక రష్మీ యాంకర్గా మానేసి హీరోయిన్గా క్రేజీ ఆఫర్ అందుకొని సెటిలవుతుందని చెప్పుకున్నారు.
anasuya-is acting with chiranjeevi
అదే సమయంలో అనసూయని రష్మీతో పోల్చిన కొందరు ఎప్పటికీ అనసూయ ఇలా బుల్లితెరమీద సందడి చేస్తూ ఉండిపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే అనసూయ కూడా క్షణం సినిమాలో పోలీస్ పాత్రలో నటించే అవకాశం అందుకుంది. ఇది గ్లామర్ రోల్ కాకపోయినా బాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం సినిమాలలో ఛాన్స్లు దక్కించుకుంది. ఈ సినిమాలతో నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మ క్యారెక్టర్ మైల్ స్టోన్ మూవీలా నిలిచింది.
anasuya-is acting with chiranjeevi
దాంతో ఇప్పుడు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనసూయ తోనే చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రవితేజ ఖిలాడి సినిమాతో పాటు, రంగ మార్తాండ, పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమాలున్నాయి. ఇవి కాకుండా తాజగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించే అవకాశం అందుకుందని టాక్ మొదలైంది. ఇందులో మంజు వారియర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. దాదాపు ఈ పాత్రకి అనసూయ ఫైనల్ అయినట్టే అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇదే నిజమైతే అనసూయకి ఏకంగా మెగాస్టార్తో కలిసి తెరను పంచుకోబోతుండటం గొప్ప విషయం అని చెప్పాలి. దీనిపై అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.