Bigg Boss Telugu 7 : ఈ ఇద్దరు అమ్మాయిలు చాలు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఎక్స్ పోజింగ్ గ్యారెంటీ

 Authored By sekhar | The Telugu News | Updated on :1 August 2023,12:00 pm

Bigg Boss Telugu 7 : తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి విడుదలైన లోగో..హోస్ట్ గా నాగార్జున యాడ్ బిగ్ బాస్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే త్వరలోనే సీజన్ కి సంబంధించి 16 మంది సభ్యుల కంటెస్టెంట్స్ పేర్లు విడుదల చేయడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్ సెవెన్ లో పోటీపడే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వస్తున్న వార్తల ప్రకారం ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ మోహన్ భోగరాజు, ప్రభాకర్, యాంకర్ నిఖిల్ డీ, కోరియోగ్రాఫర్ పాండు, టిక్ టాక్ కపుల్ దుర్గారావు పేర్లు వినిపిస్తోన్నాయి. శ్వేతా నాయుడు, యాంకర్ ధనుష్, శోభితా షెట్టి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకుంటారని సమాచారం. గత సీజన్‌లో చలాకి చంటి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ రాబోతున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ హౌస్ లో కామెడీ తో పాటు అందాల ఆరబోత కూడా.. ఫుల్ ఎక్స్పోజింగ్ చేసే కంటెస్టెంట్స్ ఉండేలా కూడా నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటారని సంగతి తెలిసిందే.

bigg boss telugu 7 new update

bigg boss telugu 7 new update

ఈసారి సీజన్ సెవెన్ లో ఇద్దరమ్మాయిలు ఫుల్ ఎక్స్ పోజీంగ్ అనీ ఈ క్రమంలో అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ్ లను తీసుకోవడానికి.. నిర్వాహకులు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే సమయంలో ఈసారి బిగ్ బాస్ హౌస్ డిజైన్ మొత్తం కాస్త డిఫరెంట్ గా తీర్చిదిద్దబోతున్నట్లు టాక్. అంతే కాదు ఈ సీజన్ లో కాస్త గ్లామర్ డోస్ ఎక్కువ ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడుతున్నట్లు వినికిడి.

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి