Chiranjeevi : 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ ప‌ని చేయ‌నున్న చిరంజీవి.. త‌న‌యుడికి పోటీనా?

Authored By Sam C | The Telugu News | Published on: February 9, 2022, 4:00 pm

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆరుప‌దుల వ‌య‌స్సులోను ఫుల్ జోష్‌లో క‌నిపిస్తున్నారు. వ‌రుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల‌ను ఆశ ఆశ్చ్య‌ప‌రుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి మ‌ధ్య‌లో కోవిడ్ పాజిటివ్ కార‌ణంగా మ‌ధ్య‌లో కాస్త బ్రేక్ తీసుకున్నారు. మ‌ళ్లీ రీసెంట్‌గా గాడ్ ఫాద‌ర్ చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉంటున్నారు. అయితే రీసెంట్‌గా ఆయ‌న ఓ కొత్త పనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా మెగాస్టార్ చిరంజీవి సంతకం చేసినట్టు సమాచారం. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఆయన బ్రాండ్ అంబాసడర్ గా చేయబోతున్నారు. త్వరలోనే ఈ యాడ్ రానుందని తెలుస్తోంది.

చిరు తనయుడు రామ్ చరణ్ కూడా ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ తో బిజీగా మారి కోట్లు సంపాదిస్తున్నారు మెగా స్టార్స్. మొత్తానికి రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల‌ను తండ్రి, కొడుకులు ప్ర‌చారం చేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో ఆస‌క్తిక‌రంగామారింది. ప్రస్తుతం జోరుమీదున్న చిరంజీవి వరుసగా నాలుగైదు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత చిరు లైనప్ చూస్తే ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న యువహీరోలకు దీటుగా సాగుతున్నట్లు అర్థం అవుతుంది.

chiranjeevi to do commercial ad

chiranjeevi to do commercial ad

Chiranjeevi : చిరు అద‌ర‌గొట్టేస్తున్నాడంతే..

ప్ర‌స్తుతం చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఇక చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించాల్సిన ఆచార్య చిత్రం ఫిబ్ర‌వ‌రి 4 న విడుద‌ల కావాల్సింది కానీ క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. చివ‌ర‌కు ఏప్రిల్ 29న విడుద‌ల కాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌టించారు. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ కూడా న‌టించారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp