Hyper Aadi : హైపర్ ఆదిని లాగి పెట్టి కొట్టేసిన నరేష్.. దెబ్బకు అంతా షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : హైపర్ ఆదిని లాగి పెట్టి కొట్టేసిన నరేష్.. దెబ్బకు అంతా షాక్

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2022,11:30 am

Hyper Aadi : శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది కింగ్ లాంటి వాడు. ఆది చెప్పిందే అక్కడే జరుగుతుంది. ఆయన వేసినవే పంచులు. ఆయనే అందరి మీదా పంచులు వేస్తుంటాడు. రాం ప్రసాద్, ఆది ఇద్దరూ కలిసి ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీని ముందుకు నడిపిస్తున్నారు. శ్రీదేవీ డ్రామా కంపెనీకి వీరే బలంగా మారిపోయారు. సుధీర్ వెళ్లిన తరువాత ఈ ఇద్దరికీ మరింతగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటే.. అందరూ ఆది, రాం ప్రసాద్ అనే అంటున్నారు. ఇక ఇందులో బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుయేల్, వర్ష వంటి వారు కూడా బాగానే ఆకట్టుకుంటున్నారు.

పొట్టి నరేష్ కామెడీ కూడా బాగానే ఉంటోంది. అయితే ఆది ఒకరిని కొట్టడమో లేదా అందరి మీద పంచులు వేయడమో చేస్తుంటారు. అలాంటి ఆది మొదటి సారి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో వెంకీ సినిమా స్పూప్ తీసినట్టు కనిపిస్తోంది. తప్పిపోయిన మాయదారి ఎక్స్‌ప్రెస్ అనే కాన్సెప్ట్‌తో షోను డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌లోనే ఆదిని లాగి పెట్టి కొట్టేశాడు నరేష్. బ్రహ్మానందంను రవితేజ కొట్టినట్టుగా.. లాగి పెట్టి కొట్టేశాడు నరేష్.

Comedian Naresh Slaps Hyper Aadi in Sridevi Drama Company

Comedian Naresh Slaps Hyper Aadi in Sridevi Drama Company

దీంతో హైపర్ ఆది ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఇలా ఆది మీద నరేష్ చేయి చేసుకోవడం, ప్రోమోలో నరేష్ రెచ్చిపోవడం, ఆది కాస్త తగ్గడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. మొత్తానికి ఈ ప్రోమోలో మాత్రం నరేష్ హైలెట్ అయ్యాడు. ఆది కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపిస్తోంది. ఇందులో యాంకర్ మంజూష తన హాట్ స్టెప్పులతోకుమ్మేసింది. పల్సర్ బైక్ డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ సైతం మాస్ స్టెప్పులు వేసింది.

YouTube video

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది