crazy multi starrer movie in tollywood chiranjeevi Jr Ntr WIth Rajamouli
Chiranjeevi Jr NTR: దాదాపుగా అందరూ చాలా సార్లు ఏవేవో ప్లాన్స్ వేసుకుంటు ఉంటారు. కానీ, అవి ఏదేని కారణాల వలన అలా వాయిదా పడుతూనే ఉంటాయి. అలా వాయిదా పడిన పనులు చాలానే ఉంటాయి. సినీ ఇండస్ట్రీలోనూ ఇటువంటి విషయాలు చాలా సార్లు జరిగి ఉంటాయి. తాజాగా ప్రొడ్యూసర్ గిరి అలా తాను నిర్మించాలనుకున్న ఓ క్రేజీ మల్టీ స్టారర్ గురించి తెలిపాడు.ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించారు. ఆ తర్వాత కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు కూడా చిత్రాలు చేశారు.
కానీ, ఆ తర్వాత వచ్చిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేశ్ లు అంతగా మల్టీస్టారర్ మూవీస్ చేయలేకపోయారు. అందుకు చాలా కారణాలుంటాయి. సరైన కథ దొరకకపోవడంతో పాటు అలా సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్ కూడా ధైర్యం చేయలేకపోయి ఉంటారు. ఈ సంగతులు అలా ఉంచితే.. సీనియర్ ప్రొడ్యూసర్ ఆవుల గిరి మల్టీస్టారర్ ఫిల్మ్స్కు శ్రీకారం చుట్టాలని భావించారట. అందుకుగాను హీరోలుగా మెగాస్టార్ చిరు, యంగ్ టైగర్ తారక్ లను సెలక్ట్ చేసుకుని, డైరెక్టర్ గా రాజమౌళిని ఫిక్స్ చేసుకున్నాడట.
crazy multi starrer movie in tollywood chiranjeevi Jr Ntr WIth Rajamouli
ఈ విషయమై చిరంజీవిని కలిసి ఆయనకు చెప్పారట. చిరు కూడా ఓకే చెప్పాడట. కానీ, కథ బాగుండాలని, అలా బాగుంటే తప్పకుండా చేద్దామని అన్నారని తెలిపాడు ప్రొడ్యూసర్ గిరి. ఇక కథగా రాజస్థాన్లోని మేవార్ రాజు మహావీర్ రాణా ప్రతాప్ సింగ్ స్టోరి.. సరిపోతుందని అనుకున్నారట. కానీ, ఎందుకో ఆ పిక్చర్ మెటీరియలైజ్ కాలేదు. అలా ఆ ప్రాజెక్టు అలానే ఆగిపోయింది. కానీ, డెస్టినీ ఉన్నట్లుంది. రాజమౌళి డైరెక్షన్ లో చిరంజీవి, రామ్ చరణ్ సినిమా చేశారు. తారక్ .. చిరుతో సినిమా చేయలేకపోయినా ఆయన తనయుడు రామ్ చరణ్ తో సినిమా చేశారు. అలా క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కింది. ఈ గ్రాండియర్ మూవీ మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల కానుంది.
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.…
Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు…
Gum Bleeding : కొంతమందికి పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కానీ,దీనిని అంతా సీరియస్గా తీసుకోరు. చిగుళ్ల…
Monsoon Season : వర్ణానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తింటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యం. అలాంటి వాతావరణం కలిగిన…
This website uses cookies.