Ramya Krishnan : రమ్య కృష్ణను పక్కలో పడుకునే సీన్స్ చేయాలన్న డైరెక్టర్.. దారుణంగా చనిపోయాడట!
Ramya Krishnan : అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. బాహుబలి సినిమాలో శివగామి అనే మేజర్ రోల్ పోషించి ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా వైడ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. పెద్ద పెద్ద యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతున్నారు. అయితే సినిమాల్లో మంచి పొజిషన్లో ఉన్న సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీని రష్యకృష్ణ పెళ్లాడిన […]
Ramya Krishnan : అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. బాహుబలి సినిమాలో శివగామి అనే మేజర్ రోల్ పోషించి ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా వైడ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. పెద్ద పెద్ద యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతున్నారు. అయితే సినిమాల్లో మంచి పొజిషన్లో ఉన్న సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీని రష్యకృష్ణ పెళ్లాడిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరికీ సక్సెస్ రేట్ అంత ఈజీగా రాదు. ఎన్నో ఏళ్ల కృషి ఫలితమేనని చాలా మంది పలు సందర్భాల్లో, ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు.
ముఖ్యంగా సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద భూతం. ప్రస్తుత తరం హీరోయిన్లే కాకుండా గతంలో బడా హీరోయిన్లుగా చెలామణి అయిన వారు కూడా క్యాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చారు. అలాంటి వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరు. అయితే వారందరినీ సమర్థవంతంగా ఎదుర్కొని యాక్టింగ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నరసింహ సినిమాలో ఆమె చేసిన నటనకు గాను సూపర్ స్టార్ రజినీకాంత్ గారు మెచ్చుకున్నారంటే ఆమె ఎలాంటి నటి అనేది అందరికీ అర్థమై ఉంటుంది. అయితే, కెరీర్ తొలి నాళ్లలో ఈమె కూడా చాలా ఇబ్బందులు పడినట్టు తెలుస్తోంది.
Ramya Krishnan : రష్య కృష్ణను అవమానించిన డైరెక్టర్
అవకాశాల పేరిట ఆమెతో చాలా మంది అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారట. ఇక ఓ స్టార్ డైరెక్టర్ ఆమెకు శృంగార వీడియోలు చూయించి ఇలా చేయచ్చుకదా అని బలవంతం చేశాడట.. ‘నువ్వు ఇలా చేస్తే నీకు డబ్బులు బాగా వస్తాయి. అలాంటి ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వడానికి నువ్వు బాగా పనికి వస్తావ్’..అంటూ అసభ్యంగా మాట్లాడాడట.. ఆ డైరెక్టర్ అప్పట్లో పెద్ద పొజిషన్లో ఉండటంతో అతని గురించి చెప్పినా ఎవరూ నమ్మలేదని చెప్పింది. కానీ కొన్నాళ్ల తర్వాత అతను దారుణంగా చనిపోయాడని పేర్కొంది. చివరి రోజుల్లో నా అనే వాళ్ళు దూరం పెట్టి తిండి కూడా దొరక్క అనాధగా నరకం అనుభవించి చనిపోయారని రమ్యకృష్ణ తన జీవితంలోని చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు.