Hyper Aadi : రష్మీకి తెలివి లేదు.. పూర్ణకి అసలేం లేదు.. ఇజ్జత్ తీస్తోన్న ఆది

Authored By aruna | The Telugu News | Published on: August 15, 2022, 4:40 pm

Hyper Aadi : బుల్లితెరపై ఆదిని మించి పంచులు వేసే వారు ఎవ్వరూ లేరు. పంచులు వేయాలన్నా, కౌంటర్లతో ఎన్ కౌంటర్ చేయాలన్నా కూడా ఆది వల్లే సాధ్యమవుతుంది. అవతల ఉన్నది ఎవరన్నది కూడా ఆది పట్టించుకోడు. తన స్టైల్లో పంచులు వేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. అలాంటి ఆది ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీలో రెచ్చిపోతోన్నాడు. రాం ప్రసాద్‌తో కలిసి ఆది ఆ షోలో దుమ్ములేపుతున్నాడు.

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఆది అందరినీ ఆడేసుకున్నాడు. అందరి దగ్గర అప్పు తీసుకున్నట్టు.. ఆ అప్పు చెల్లించకుండా.. వారిని ముప్పు తిప్పలు పెట్టే కారెక్టర్‌లో ఆది, రాం ప్రసాద్ దుమ్ములేపేశారు.అయితే వారందరికీ అప్పు చెల్లించకుండా.. శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్లతో ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తానని చెబుతాడు. ఇక ఇదెలా సాధ్యమంటూ వారి దగ్గర పని చేసే ఇమాన్యుయేల్ అడుగుతాడు.

Hyper Aadi Punches on Rashmi Gautam And Poorna Knowledge

Hyper Aadi Punches on Rashmi Gautam And Poorna Knowledge

వాళ్ల దగ్గర కూడా అప్పు తీసుకుని, వీళ్లకు ఇస్తాం. వారితోనే ఎంటర్టైన్ చేయిస్తామని ఆది అంటాడు. వాళ్లు తెలివైన వాళ్లు కదా? మనకు ఎందుకు అప్పు ఇస్తారంటూ ఇమాన్యుయేల్ అడుగుతాడు. వాళ్లు తెలివైన వాళ్లా? రష్మీకి తెలివే లేదు.. ఇక పూర్ణకు అసలు ఏం లేదు అని ఆది మరింత కౌంటర్లు వేస్తాడు. పూర్ణ వచ్చాక రాం ప్రసాద్ తగులుకుంటాడు. నాలుగు ఎపిపోడ్‌లకు గ్యాప్ ఇచ్చావ్ అని ఆది అడుగుతాడు.

నువ్ రానప్పుడే బాగుంది.. అందరూ బాగుందని అన్నారు.. రాకుండా ఉంటేనే బాగుండేదన్నట్టుగా రాం ప్రసాద్ అంటాడు. దీంతో పూర్ణ ఒక్క గుద్దు గుద్దేస్తుంది. పొట్టిలో కొట్టడంతో రాం ప్రసాద్ షాక్ అవుతాడు. అలా ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా రష్మీ, పూర్ణల పరువుతీసేశారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp