Tollywood Comedians : టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజుకే ఇంత పారితోషికమా… ఎంతో తెలిస్తే అవాక్…

 Authored By prabhas | The Telugu News | Updated on :13 July 2022,11:00 am

Tollywood Comedians : ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కాలి అంటే దానికి బడ్జెట్, అలాగే నటీనటులకు పారితోషకం ఇలాంటివి ముందే చర్చించుకుంటారు. అయితే కొన్ని పవర్ఫుల్ గా ఉండే రోల్స్ లలో చేసే స్టార్ కమెడియన్లకు అధిక మొత్తంలోనే పారితోషకం ఇస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే అయితే వాళ్లు అసలు ఎంత పారితోష్కమును తీసుకుంటారు. ఎవరికీ తెలియదు. పాత స్టార్ కమెడియన్లు ఎంతో క్రేజ్ ఉన్న రాజబాబు, రేలంగి వీరు హీరోలతో పాటు పారితోషకం తీసుకునేవారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ కమెడియన్స్ గా పేరుపొందిన ఆయన ప్రతి సినిమాలో కమెడియన్గా చేసి ఎంతో పాపులర్ అయ్యాడు. ఆయనే బ్రహ్మానందం, ఆయన పారితోషకం ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారంట..

అయితే బ్రహ్మానందాన్ని వీలైనంతవరకు సినిమాలలో తీసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. నిర్మాతలు, అయితే బ్రహ్మానందం కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలలో తను రోజుకి మూడు లక్షల రూపాయలు పైగానే తీసుకునేవాడు అంట. అలాగే వెన్నెల కిషోర్ ఒక సంవత్సరానికి 25 చిత్రాల వరకు చేస్తూ ఉంటాడు. ఈయన లేని సినిమా అంటూ ఉండదు. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్దపెద్ద హీరోలతో ప్రతి ఒక్కరి సినిమాలలో చేస్తూ ఉంటాడు. అయితే వెన్నెల కిషోర్ ఒక్క చిత్రానికి మూడు లక్షల రూపాయలు తీసుకుంటాడు. పోసాని మురళి కృష్ణ ఈయన దర్శకుడిగా రచయితగా అలాగే కమెడియన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

I wonder if Tollywood comedians are paid this much for one day

I wonder if Tollywood comedians are paid this much for one day

పోసాని ఇప్పటివరకు 30 సినిమాలు చేశారు. పోసాని రోజుకు 2.5 లక్షల వరకు తీసుకుంటారని వార్త. సునీల్ ఒక్క కమెడియనే కాదు, తను హీరోగా విలన్ గా చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే తనకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఇటీవల లో విలన్ గా చేస్తూ ఉత్తమ నటుడుగా పేరుపొందాడు. ఆయన రోజుకు 4 లక్షల వరకు పారితోషికం తీసుకుంటారు. ఆలీ సీతాకోకచిలుక సినిమా ద్వారా బాల నటుడుగా సినీ రంగానికి పరిచయం అయ్యాడు. దీని తర్వాత కమెడియన్, గా హీరోగా చాలా సినిమాలలో నటించాడు. ప్రస్తుతం కామెడీకే ఇంటి అడ్రస్ గా నిలిచిపోయాడు. అయితే ఆలీ ఒక్క రోజుకు దాదాపు 3.5 లక్షల వరకు పారితోషకం తీసుకుంటారని సమాచారం.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి