Venkatesh : బాలకృష్ణను అత్యంత దారుణంగా మోసం చేసిన వెంకటేష్ .. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..!

 Authored By aruna | The Telugu News | Updated on :9 October 2023,9:00 pm

Venkatesh : టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేష్, బాలకృష్ణ లకు హీరోలుగా మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకే జనరేషన్ కు చెందిన వీళ్ళిద్దరూ పలుమార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డారు. కానీ ఓ సినిమా విషయంలో వెంకటేష్ చేతిలో బాలకృష్ణ దారుణంగా మోసపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాంపిటీషన్ అనేది చాలా కామన్. మరీ ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలలో హీరోల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. ఇదే తరహాలో ఒకేరోజు ఒకే కథతో బాలయ్య, వెంకటేష్ లు ఇద్దరు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డారు.

ఈ సినిమాలు విడుదల 34 ఏళ్ళు అవుతుంది. అయితే వీరిద్దరూ చేసిన సినిమాలు ఒకే స్టోరీ తో వచ్చాయట. బాలయ్య నటించిన ‘ అశోక చక్రవర్తి ‘, వెంకటేష్ నటించిన ‘ ధ్రువ నక్షత్రం ‘ సినిమాలు ఓకే కథతో ఒకేరోజు విడుదలయ్యాయి. బాలకృష్ణ అశోక చక్రవర్తి సినిమా మలయాళం లో మోహన్ లాల్ నటించిన ఆర్యన్ సినిమాకి రీమేక్. ఈ సినిమాను ఎస్. ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించారు. మరోవైపు వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా మలయాళం మూవీ ఆర్యన్ కి ప్రేరణగా తీసుకొచ్చారు.

Intresting news about Venkatesh, Balakrishna

Intresting news about Venkatesh, Balakrishna

అయితే బాక్స్ ఆఫీస్ బరిలో వెంకటేష్ ధ్రువ నక్షత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాలకృష్ణ అశోక చక్రవర్తి సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు. ఒకరకంగా బాలయ్య, వెంకటేష్ లను మోసం చేసింది పరుచూరి బ్రదర్స్ అని చెప్పాలి. ఏది ఏమైనా ఒకే కథతో వెంకటేష్ హిట్ అందుకుంటే బాలకృష్ణ హిట్టును అందుకోలేక పోయారు. ఇలా బాలయ్య వెంకటేశ్ లు ఒకే కథతో బాక్సాఫీస్ బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే బాలకృష్ణని వెంకటేష్ మోసం చేశాడని అంటుంటారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి