Jabardasth Apparao : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన నటులలో ఒకరు అప్పారావు. ఈ షో ద్వారా చాలామంది సెలబ్రిటీలుగా మారారు. ఫైనాన్షియల్ గా కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ షో మొదలై పదేళ్లు దాటుతున్న ఇంకా బుల్లితెరపై కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ షో ద్వారా ఎంతోమంది వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నారు. ఇక అప్పారావు కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వాడే. దీని ద్వారానే పలు సినిమాలలో కమెడియన్ కూడా నటించాడు. అయితే తాజాగా అప్పారావు సోషల్ మీడియాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కి ఎలాంటి డిమాండ్ ఉన్న ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉన్నది లేనిది మొత్తం యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ వంటి వాటిల్లో పెడుతూ జనాలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను బ్రతికుండగానే చనిపోయారని వార్తలు రాస్తున్నారు. డబ్బు కోసం బ్రతికున్న మనిషి చంపేస్తారా అని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు అయినా కానీ అవి ఆగడం లేదు. దీనిపై స్పందించిన అప్పారావు యూట్యూబర్స్ కి ఒకటి చెప్పాలి. దీని మీద నేనొకటి నాటిక కూడా రాద్దాం అనుకున్నాను. ప్రముఖులు బ్రతికుండగానే చనిపోయారని పోస్ట్ లు పెడుతున్నారు.
సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. అయితే బ్రతికున్న వ్యక్తులను చంపేసే హక్కు మీకు లేదు. అందరూ చనిపోతారు ఈ వార్తలు రాసే వాళ్ళు కూడా చనిపోతారు. లింక్ క్లిక్ చేయడం కోసం చనిపోయారని రాయడం క్షమించరాని నేరం అని, అవి మానసిక వేదనకు దారితీస్తాయని, పెద్దవారి తరుపున కూడా నేను కోరుకుంటున్నాను అన్నారు. మనకు తెలిసిందే ఈ మధ్య యూట్యూబ్లో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయారని పోస్ట్ క్రియేట్ చేశారు. నిజమే అని నమ్మిన పోలీసులు ప్రముఖుల భద్రత కోసం ఆయన నివాసానికి వెళ్లారు. పోలీసు వాహనానికి కోట శ్రీనివాసరావు ఎదురు రావడంతో వాళ్లు షాక్ అయ్యారు. ఇదేంటండి మీరు చనిపోయారని న్యూస్ వచ్చింది అని అన్నారు. ఈ విషయం పైనే అప్పారావు సోషల్ మీడియాపై కాస్త ఫైర్ అయినట్లు తెలుస్తుంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.