Jabardasth New Anchor
Jabardasth : జబర్దస్త్ కామెడీ షో మరో టర్న్ తీసుకుంది, ఇప్పటికే ఎంతో మంది కమెడియన్స్ వెళ్ళి పోయారు. వారితో పాటు జడ్జిలు ఇద్దరు కూడా వెళ్ళి పోయారు. ప్రస్తుతం జడ్జీలుగా వస్తున్న వాళ్లు ఎవరు అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సమయంలో యాంకర్లు కూడా అటూ ఇటూ అవుతుండడంతో ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా జబర్దస్త్ నుండి అనసూయ అవుట్ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కి దూరమవుతున్నట్లు గా ఇప్పటికే ప్రకటించిన అనసూయ స్టార్ మా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
జబర్దస్త్ లో అనసూయ ప్లేస్ ని భర్తీ చేసేదెవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా వచ్చిన ప్రో మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వారం జబర్దస్త్ యాంకర్ రాబోతుంది ఈమె అంటూ టీం మెంబర్స్ అంతా కూడా చేసిన సందడి ప్రోమో లో ఆసక్తికరంగా మారింది. ఇంతకు రాబోతున్న ఆ కొత్త యాంకర్ ఎవరు అనేది ఆసక్తిగా మారిన నేపథ్యంలో మల్లెమాల వారి నుండి మాకు అందిన సమాచారం ప్రకారం రష్మి గౌతమ్ ఆ ప్లేస్ ని భర్తీ చేయబోతున్నట్లు గా తెలుస్తోంది గతంలో కూడా అనసూయ వెళ్లి పోయిన సమయంలో రష్మి గౌతమ్ జబర్దస్త్ నడిపించింది.
Jabardasth New Anchor
ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ కోసం వారంలో రెండు రోజులు రష్మి గౌతమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గా సమాచారం అందుతోంది. ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీ కి యాంకర్గా వ్యవహరిస్తున్న రష్మి గౌతమ్ త్వరలోనే జబర్దస్త్ రెండు ఎపిసోడ్ లను కూడా యాంకరింగ్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతోంది. అనసూయ కంటే రష్మీ ఎందులోనూ తక్కువ కాదని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది. కనుక జబర్దస్త్ కు ఏమాత్రం లోటు లేకుండా రష్మి గౌతమ్ నిర్వహించి తీరుతుంది అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. కొన్ని వారాల తర్వాత జబర్దస్త్ కొత్త యాంకర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మల్లెమాల వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.