
jeevitha rajasekhar question to mega family
Jeevitha Rajesekhar : సినీ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పట్లో రాజశేఖర్ చాలా సినిమాల్లో హీరోగా నటించారు. ఒకప్పుడు స్టార్ హీరోగానూ ఉన్నారు. ఇప్పటికీ రాజశేఖర్ కు తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ ఉంది. ఇప్పటికీ ఆయన హీరోగా పలు సినిమాలు తీస్తున్నారు. హీరోయిన్ గా ఉన్న జీవితను పెళ్లి చేసుకున్న రాజశేఖర్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు కూడా తండ్రి, తల్లి బాటలోనే ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే.. తాజాగా జీవిత, రాజశేఖర్ ఇద్దరూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈసందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ తన తల్లి చనిపోయినప్పటి నుంచి తనకు బాధ్యతలు పెరిగాయని చెప్పారు. తన మీద ఎవ్వరికీ కోపం లేదని, ఎవ్వరి మీద శతృత్వం లేదని.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా మాట్లాడారు. చిరంజీవి గారితో కొన్నేళ్ల కింద చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆయన పార్టీ పెట్టినప్పుడు మా మధ్య కొన్ని గొడవలు వచ్చాయి. దీంతో కొన్ని రోజులు ఇద్దరం మాట్లాడుకోలేదు. కానీ.. ఇప్పుడు అలా లేదు. మా రెండు ఫ్యామిలీలు కలిశాయి. ఇప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నారు.. నేను ఆయనతో మాట్లాడుతున్నా అని చెప్పుకొచ్చారు రాజశేఖర్.
అయితే.. నాకు మిగిలిపోయిన ఒకే ఒక్క బాధ ఏంటంటే జగన్ గారితో వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్ అంటూ చెప్పుకొచ్చారు రాజశేఖర్. నేను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే.. అప్పుడు ఆయన తన తండ్రిని ఉపయోగించుకొని.. అప్పట్లో విజయవాడలో మీటింగ్ పెడితే నేను వెళ్లాను. నేను అక్కడికి వెళ్లడంతో జనాలు నన్న చూశారు. దీంతో వాళ్లకు హాయ్ చెప్పినట్టుగా నేను చేతులు ఊపాను. అది జగన్ గారికి నచ్చలేదు. అప్పుడే చెప్పేసి ఉంటే నేను వెంటనే డైరెక్ట్ గా వెళ్లి ఉండేవాడిని. అంతే తప్ప నేను కావాలని చేయలేదు. కానీ.. జగన్ గారికి, పార్టీకి అది ఒక డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి నేను జగన్ గారిని కలిసి అసలు జరిగిన విషయం చెప్పాలని అనుకున్నాను. అప్పటి నుంచి జగన్ గారిని కలవడం కోసం ప్రయత్నించాను. చివరకు నాకు ఇవాళ జగన్ గారితో మాట్లాడే అవకాశం లభించింది.. అని రాజశేఖర్ అన్నారు.
మనకు ఉన్న నేతలు ఇద్దరేనండి.. ఒకరు చంద్రబాబు.. ఇంకొకరు జగన్. ఇద్దరిలో ఎవరు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే నేను జగన్ కే మద్దతు ఇస్తున్నా. ఎందుకంటే.. మనం ఎన్నికలప్పుడు ఇచ్చే 3000 డబ్బులు తీసుకుంటే కాదు.. ఎవరు నిజంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది చూడాలి. ఏపీలో వైఎస్సార్ తీసుకొచ్చిన పథకాలే ఇప్పటికీ నడుస్తున్నాయి. అప్పు తీర్చడం దగ్గర్నుంచి పిల్లలకు స్కూల్ ఫీజులు ఇస్తున్నారు. మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. నవరత్నాలు అమలు చేస్తున్నారు. జగన్ ఎప్పుడూ ప్రజలు ప్రజలు అంటూ తిరుగుతున్నారు. ఆయనకు ప్రజలు తప్ప మరో పనే లేదు. మన కోసమే బతుకుతున్న జగన్ గారికి మరోసారి అవకాశం ఇద్దాం. ఆయన వైఎస్సార్ కు ఈక్వల్ గా చేస్తారు.. లేదా అంతకంటే ఎక్కువే చేస్తారు అంటూ రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.