Keerthy Suresh : కేక పెట్టించే అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న కీర్తి సురేష్
Keerthy Suresh : నేను శైలజ చిత్రంతో కుర్రకారు మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట తో పాటు చిరంజీవి భోళా శంకర్ సినిమాల్లో కీర్తి సురేష్ నటిస్తోంది. భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. […]
Keerthy Suresh : నేను శైలజ చిత్రంతో కుర్రకారు మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట తో పాటు చిరంజీవి భోళా శంకర్ సినిమాల్లో కీర్తి సురేష్ నటిస్తోంది. భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్గా వస్తోంది.
మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది.కీర్తి అందం అదరహో..వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్కి సరైన సక్సెస్ రావడం లేదు. ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రంపైనే హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే కీర్తి సురేష్ ఫేట్ మారినట్టే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా కీర్తి సురేష్ చీరకట్టులో అందంగా కనిపించింది. మహానటి స్టన్నింగ్ లుక్స్కి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. చీరకట్టులో అమ్మడిని చూసి షేక్ అవుతున్నారు.
సర్కారు వారి పాట చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు పరశురాం, హీరోయిన్ కీర్తి సురేశ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బార్సిలోనాలో కళావతి సాంగ్ షూటింగ్ జరుగుతుండగా దొంగలు తన కాస్ట్యూమ్స్ఎత్తుకెళ్ళారని చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్… ఆ నగరంలో దొంగల బెడద ఎక్కువని, షూట్ చేస్తోన్న టైంలో కొందరు దొంగలు వ్యానును బద్దలుకొట్టి.. కాస్ట్యూమ్స్ అన్నింటినీ ఎత్తుకెళ్లిపోయారని తెలిపింది. అయితే మళ్ళీ 48 గంటల్లోపు కొత్త కాస్ట్యూమ్స్ ని ఇండియా నుంచి తెప్పించారని వెల్లడించింది. కాగా ఈ సినిమాని GMB ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.