SSMB29 : జస్ట్ రాజమౌళి అప్డేట్ సోషల్ మీడియా షేక్ అయిపోయిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SSMB29 : జస్ట్ రాజమౌళి అప్డేట్ సోషల్ మీడియా షేక్ అయిపోయిందిగా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :26 January 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  SSMB29 : జస్ట్ రాజమౌళి అప్డేట్ సోషల్ మీడియా షేక్ అయిపోయిందిగా..!

SSMB29 : మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమాపై ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారన్నది చూపించేలా జస్ట్ రాజమౌలి సిం హం పాస్ పోర్ట్ లాక్ అయిందని సింబాలిక్ గా చూపించగా ఆ అప్డేట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాని షేక్ చేసేలా రీ ట్వీట్స్, ట్రెండింగ్ లో ఉంచారు. జస్ట్ జక్కన్న అలా పాస్ పోర్ట్ లాక్ అనేలా చెప్పాడంతే ఈ సినిమాపై బజ్ ఎంత ఉంది అన్నది తెలియచెప్పేలా ఎక్స్ లో మోత మోగించేశారు ఫ్యాన్స్. అసలైతే మహేష్ బాబు తో సినిమా కోసం రాజమౌళి కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అన్నది ఆల్రెడీ రాసి పెట్టి ఉంటుంది. సో అలానే రాజమౌళి తో మహేష్ సినిమా పర్ఫెక్ట్ ప్లేస్ మెంట్ లో పడుతుంది. బాహుబలితో పాన్ ఇండియా.. RRRతో పాన్ వరల్డ్ ని షేక్ చేసిన రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో హాలీవుడ్ ని షేక్ చేయబోతున్నాడు.

SSMB29 జస్ట్ రాజమౌళి అప్డేట్ సోషల్ మీడియా షేక్ అయిపోయిందిగా

SSMB29 : జస్ట్ రాజమౌళి అప్డేట్ సోషల్ మీడియా షేక్ అయిపోయిందిగా..!

SSMB29 : తనని తాను సంసిద్ధం చేసుకుంటున్నాడు..

మహేష్ బాబు కూడా ఈ సినిమాకు తనని తాను సంసిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ 3 ఏళ్లు డేట్స్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా లాక్ అయ్యింది. పీసీ హీరోయిన్ గా చేయడం హాలీవుడ్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.

రాజమౌళి మహేష్ బాబు కాంబో సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి హీరోయిన్ ఫిక్స్ అవ్వగా మిగతా కాస్టింగ్ ఎవరన్నది త్వరలో అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి చెబుతారని తెలుస్తుంది. ఈ సినిమాకు రాజమౌళి 6 నెలల వర్క్ షాప్ చేయనున్నారని తెలుస్తుంది. మహేష్ గుంటూరు కారం సినిమా కేవలం తెలుగులోనే రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రాజమౌళి సినిమా తర్వాత మహేష్ పాన్ ఇండియా స్టార్ గా అదరగొట్టేస్తాడని చెప్పొచ్చు. Mahesh Babu, Rajamouli, SSMB29, Social Media, Superstar Mahesh, Priyanka Chopra

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది