mahesh babu trivikram srinivas combo movie launched
Mahesh Babu: అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో అనౌన్స్మెంట్ రాగా, ఈ రోజు మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈరోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే మహేష్ బాబు హాజరు కాలేదు. కానీ ఆయన తరపున మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, పూజ హెగ్డే, త్రివిక్రమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
దర్శకుడు త్రివిక్రమ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించారు. షూటింగ్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ‘SSMB28’ మహేష్ బాబు, త్రివిక్రమ్, థమన్, పూజా హెగ్డే మరియు హారిక హాసిని క్రియేషన్స్ కలయికలో రాబోతోంది. ఈ సినిమా మార్చిలో సెట్స్పైకి రానుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు.
mahesh babu trivikram srinivas combo movie launched
ప్రస్తుతం మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సినిమా నిర్మితమవుతుంది. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుది. మేకర్స్ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ విడుదల చేశారు. మరో వైపు త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన వర్క్ను పూర్తి చేశారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.