Niharika Konidela : నాగబాబును మోసం చేసిన నిహారిక.. ఇంత దారుణ‌మా..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 17 August 2022, 4:20 pm

Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడుగురు హీరోలు కేవలం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం.ఇక మెగా కుటుంబం నుంచి నాగబాబు గారాల పట్టి నిహారిక కూడా ఆ మధ్యలో పలు సినిమాలు చేసింది. అందులో కొన్నిఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. నిహారిక కూడా వారసత్వాన్ని అడ్డుపెట్టుకోకుండా తన నటనకు ప్రియారిటీ ఇచ్చింది. నటిగా రాణించాలని చాలానేట్రై చేసింది. కానీ అనుకోకుండా పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది.

Niharika Konidela : నాగబాబును పట్టించుకోని కూతురు

మెగాస్టార్ చిరు సినిమాల్లో బిజీగా ఉండగా..నాగబాబు మాత్రం ఎక్కువగా సినిమాల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు.అడపాదడపా సినిమాల్లో చేస్తూనే నిర్మాణ సంస్థను పెట్టి నడిపించారు మెగాబ్రదర్. ఆరెంజ్ సినిమాతో పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు.. బుల్లితెరపై జబర్దస్త్ షోకు జడ్జిగా కూడా కొన్నాళ్లు వ్యవహరించారు. ఈటీవీ మేనెజ్మెంట్‌తో ఎక్కడ చెడిందేమో తెలీదు కానీ జీ తెలుగులో అదిరింది షోతో మళ్లీ జడ్జిగా అవతారం ఎత్తారు. ఇదే టైంలో రాజకీయంగా తమ్ముడికి సపోర్ట్ చేస్తూ జనసేన పార్టీ తరపున 2019 నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి లోక్ సభ‌కు కూడా పోటీ చేశారు.నాగబాబు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటుంటారు.

Niharika Konidela cheated NagaBabu

Niharika Konidela cheated NagaBabu

ఈ మధ్య కాలంలో నాగబాబు మా చానెల్‌లో ప్రసారమయ్యే చాలా ఈవెంట్లలో కనిపిస్తున్నాడు.దీనికి కారణం మల్లెమాల ప్రొడక్షన్ తో నాగబాబుకు మనస్పర్ధలు రావడమే అని చాలా మందికి తెలుసు. అయితే, కూతురు నిహారిక మాత్రం తండ్రికి అసలు నచ్చని మల్లెమాల ప్రొడక్షన్‌లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. నాగబాబు మాత్రం ఎన్నో రోజులుగా మల్లెమాల సంస్థకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీనిహారిక మాత్రం తండ్రికి ఇష్టం లేని మల్లెమాల ప్రొడక్షన్‌లో జరిగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు వెళ్లి తండ్రిని అవమానించిందని చాలా మంది అంటున్నారు. ఇక నిహారిక అక్కడికి వెళ్లడం చూసిన నెటిజన్లు తండ్రికి వెన్నుపోటు పొడిచిందని పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి