Rajamouli : బ్రేకింగ్.. అవతార్ 2 రిలీజ్ రోజునే RRR2 గురించి రాజమౌళి సంచలన ప్రకటన ..?

Authored By Breaking News | The Telugu News | Updated on : 16 December 2022, 6:30 pm

Rajamouli : నేడు ప్రపంచవ్యాప్తంగా 160 భాషలలో అవతార్ 2,Avatar 2, రిలీజ్ అయింది. మొట్టమొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. 2009లో విజువల్ వండర్ గా వచ్చిన అవతార్ సినిమా, Avatar movie కి కొనసాగింపుగా… దర్శకుడు జేమ్స్ కామెరూన్, James Cameron, దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, Avatar: The Way of Water ,ప్రేక్షకులను అలరిస్తోంది. 3D నేపథ్యంలో తెరకెక్కించటంతో… సముద్రపు నీటిమడుగులో మరో ఊహాజనిత ప్రపంచాన్ని అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ మీద దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.

సముద్రంలో రకరకాల సముద్రపు జీవులు వాటి మధ్య అనుబంధాలు ఇంకా భావోద్వేగాకరమైన సన్నివేశాలను.. చూపించడం జరిగింది. ఇదిలా ఉంటే డైరెక్టర్ రాజమౌళి, Rajamouli ,”అవతార్ 2″ రిలీజ్ అయిన రోజే… “RRR 2″కి సంబంధించి సంచలన ప్రకటన చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. “RRR” అంతర్జాతీయంగా రాజమౌళికి మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మూడు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పలు అంతర్జాతీయ సినిమా ఉత్సవాలకు జక్కన వెళ్లిన ప్రతిసారి “RRR” సీక్వెల్ ప్రశ్నలు మీడియా నుండి ఎదురవుతున్నాయి.

Rajamouli about rrr 2 movie 

Rajamouli about rrr 2 movie

ఇలాంటి తరుణంలో “RRR” సీక్వెల్ కి అవకాశాలు ఉన్నాయని ఇంతకుముందే రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆదిశగానే తన తండ్రి స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఆలోచన చేస్తున్నట్లు ఈ క్రమంలో ఈరోజు ఈ సినిమా సీక్వెల్ చేయటానికి దర్శకుడు రాజమౌళి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “RRR” మొదటి భాగంలో ఎన్టీఆర్ పాత్ర కంటే చరణ్ పాత్ర హైలెట్ కావడం తెలిసిందే. ఈసారి సెకండ్ పార్ట్ లో తారక్ పాత్రకి అధిక ప్రాధాన్యత ఇచ్చి స్టోరీ రెడీ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి