Bigg Boss OTT Telugu : ఆర్జే చైతూ, బిందు.. ఇద్దరే చాలెంజర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తున్నారా? మిగితా వాళ్లు డమ్మీయేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss OTT Telugu : ఆర్జే చైతూ, బిందు.. ఇద్దరే చాలెంజర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తున్నారా? మిగితా వాళ్లు డమ్మీయేనా?

Bigg Boss OTT Telugu : చాలెంజర్స్ టీమ్ లో ఉన్న కంటెస్టెంట్లు చాలామంది ఉన్నారు కానీ.. చాలెంజర్స్ టీమ్ మొత్తాన్ని కేవలం ఆర్జే చైతూ, బిందు ఇద్దరూ కంట్రోల్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఆర్జే చైతూ మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి హౌస్ ను కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. మనోడికి ఆటిట్యూడ్ బాగానే ఉందని హౌస్ మెంబర్స్ తో పాటు బయట ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు.చైతూ.. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 March 2022,9:00 pm

Bigg Boss OTT Telugu : చాలెంజర్స్ టీమ్ లో ఉన్న కంటెస్టెంట్లు చాలామంది ఉన్నారు కానీ.. చాలెంజర్స్ టీమ్ మొత్తాన్ని కేవలం ఆర్జే చైతూ, బిందు ఇద్దరూ కంట్రోల్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఆర్జే చైతూ మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి హౌస్ ను కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. మనోడికి ఆటిట్యూడ్ బాగానే ఉందని హౌస్ మెంబర్స్ తో పాటు బయట ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు.చైతూ.. చాలెంజర్స్ టీమ్ నే కాదు.. వారియర్స్ టీమ్ ను కూడా కంట్రోల్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.

చాలెంజర్స్ టీమ్ లో ఉన్న మిగితా కంటెస్టెంట్లు కూడా చైతూ ఏది చెబితే అది చేస్తున్నారు. చైతూకు బిందు కూడా తోడయింది. తను కూడా చాలెంజర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తోంది అని స్పష్టంగా అర్థం అవుతోంది.ఉదాహరణకు చాలెంజర్స్ టీమ్.. వారియర్స్ టీమ్ కు ఏదైనా టాస్క్ ఇవ్వాలన్నా.. పనిష్ మెంట్ ఇవ్వాలన్నా చైతూ, బిందు ఇద్దరే ముందుకొచ్చి వారియర్స్ టీమ్ కు కానీ.. కెప్టెన్ కు ఏదైనా చెప్పాలన్నా.. వారియర్స్ టీమ్ సభ్యులకు ఏదైనా చెప్పాలన్నా వాళ్లే చెబుతున్నారు.

rj chaitu and bindu controlling challengers team in bigg boss ott telugu

rj chaitu and bindu controlling challengers team in bigg boss ott telugu

Bigg Boss OTT Telugu : చాలెంజర్స్ టీమ్ తరుపున ప్రతి విషయంలో చైతూ, బిందు ఇన్వాల్వ్

దీంతో వారియర్స్ టీమ్ కు కూడా ఈ విషయంలో కోపం వస్తోంది. ఇదే విషయమై కెప్టెన్ తేజస్వితో చైతూ గొడవ పెట్టుకున్నాడు. బిందు కూడా గొడవ పెట్టుకుంది. ఇద్దరూ కలిసి చాలెంజర్స్ టీమ్ తరుపున పనిష్ మెంట్ ఇస్తున్నాం మీకు అని చెబుతారు. దీంతో తేజస్వికి కోపం వస్తుంది. మీరు ఏదైనా పనిష్ మెంట్ ఇవ్వాలనుకుంటే టీమ్ తో కలసి మాట్లాడి చెప్పండి అని అంటుంది తేజస్వి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది