Samantha : అక్కినేని నాగ చైతన్యతో నాలుగేళ్ల వైవాహిక జీవితం గడిపిన సమంత అనూహ్యంగా అక్టోబర్ 2, 2021న విడాకులు ఇచ్చింది. వీరిద్దరి విడాకుల వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడాకుల తర్వాత సమంత చాలా డల్ అయింది. తాను చనిపోవాలని అనుకున్నట్టుగా కూడా పేర్కొంది. ఇప్పుడిప్పుడే గత జ్ఞాపకాలు మరచిపోతూ సాధారణ జీవితం గడుపుతున్న సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర పోస్ట్లు పెడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది.
విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా గోవా వెళ్లి వచ్చింది. అక్కడ బికినీలో ఈ ముద్దుగుమ్మ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బికినీలో రచ్చ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక రీసెంట్గా తన ఫ్రెండ్స్ అయిన వెన్నెల కిషోర్ , రాహుల్ రవీంద్రన్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనికింద మీరు లేకుండా నేనేం చేయగలను మిత్రమా అంటూ కామెంట్ కూడా షేర్ చేసింది.
ఇక తాజాగా ప్రకృతికి సంబంధించిన పిక్ షేర్ చేయగా, అందులో సూర్యోదయానికి సంబంధించిన ఫొటో ఉండగా, దానికి నేను గుడ్ థింగ్స్ ను ఫీల్ అవ్వడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు కూడా గుడ్ థింగ్స్ ను ఫీల్ అయ్యేలా చెయ్యి అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వెనక అర్ధమేంటా అని అందరు ఆరాలు తీస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆ మధ్య శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం యశోద అనే సినిమా చేస్తుంది. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తైంది. త్వరలో మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.