Samantha : కొత్త ఫ్రెండ్‌తో తెగ చక్క‌ర్లు కొడుతున్న స‌మంత‌.. చైతూని పూర్తిగా మ‌ర‌చిపోయిన‌ట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : కొత్త ఫ్రెండ్‌తో తెగ చక్క‌ర్లు కొడుతున్న స‌మంత‌.. చైతూని పూర్తిగా మ‌ర‌చిపోయిన‌ట్టేనా?

Samatnha : ఎన్నో ఆశ‌ల‌తో పెద్ద‌ల‌ని ఒప్పించి ఒక్క‌ట‌య్యారు నాగ చైత‌న్య‌, స‌మంత‌. 2017లో వేద‌మంత్రాల సాక్షిగా ఒక్క‌టైన ఈ జంట దాదాపు మూడేళ్ల‌కు పైగా ఎంతో ప్రేమ‌గా ఉన్నారు. కాని ఏవో వీరిద్ద‌రిని హ‌ర్ట్ చేశాయి. దీంతో అక్టోబర్, 2021న విడాకులు తీసుకున్నారు. ఈ జంటను చూసి ఎవరికి కన్ను కుట్టిందో ఏమో కానీ అర్ధాంతరంగా విడాకుల న్యూస్‌ అభిమానుల చెవిలో వేసి షాకిచ్చారు చైసామ్‌. విడాకుల ద‌గ్గ‌ర నుండి సమంత, చైతన్య ఏదో ఒక […]

 Authored By sandeep | The Telugu News | Updated on :13 February 2022,5:30 pm

Samatnha : ఎన్నో ఆశ‌ల‌తో పెద్ద‌ల‌ని ఒప్పించి ఒక్క‌ట‌య్యారు నాగ చైత‌న్య‌, స‌మంత‌. 2017లో వేద‌మంత్రాల సాక్షిగా ఒక్క‌టైన ఈ జంట దాదాపు మూడేళ్ల‌కు పైగా ఎంతో ప్రేమ‌గా ఉన్నారు. కాని ఏవో వీరిద్ద‌రిని హ‌ర్ట్ చేశాయి. దీంతో అక్టోబర్, 2021న విడాకులు తీసుకున్నారు. ఈ జంటను చూసి ఎవరికి కన్ను కుట్టిందో ఏమో కానీ అర్ధాంతరంగా విడాకుల న్యూస్‌ అభిమానుల చెవిలో వేసి షాకిచ్చారు చైసామ్‌. విడాకుల ద‌గ్గ‌ర నుండి సమంత, చైతన్య ఏదో ఒక రూపంలో తరచూ వార్తల్లో నిలస్తున్నారు. గ‌తంలో ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను కురిపించుకున్న వీడియోలు కూడా తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

వీళ్లిద్దరూ భార్యాభర్తలుగా కొనసాగుతున్న సమయంలో సామ్‌ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. ‘చై హజ్బెండ్‌ మెటీరియల్‌. ఒకసారి మా అమ్మకు ఫోన్‌ చేయడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. అప్పుడు చై వెంటనే తన ఫోన్‌ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడుకోమన్నాడు. చైతూ నిజంగా పర్ఫెక్ట్‌ జెంటిల్‌ మ్యాన్‌’ అని పొగడ్తలు కురిపించింది. మ‌రి త‌న‌ని ఎంతో ఇష్ట‌ప‌డే స‌మంత ఎందుకు విడాకులు ఇచ్చింద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.వీర‌ద్ద‌రు తిరిగి క‌లిస్తే బాగుండ‌ని చాలా మంది ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, అది అసంభ‌వ‌మే అనిపిస్తుంది.

Samantha new friend is varalaxmi

Samantha-new-friend-is-varalaxmi

Samatnha : స‌మంత న్యూ ఫ్రెండ్స్ ..

చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత శిల్పా రెడ్డి స‌ల‌హాలు వింటూ ఆమెతో ప‌లు యాత్ర‌ల‌కు వెళ్లింది. గోవా టూరుకి శిల్పారెడ్డి ఫ్యామిలీ తో పాటు సమంత వెళ్లారు. సమంత సదరు ట్రిప్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. డెహ్రాడూన్ లో వారం రోజులు శిల్పారెడ్డి సమంత గడపడం జరిగింది. హిమాయలలో ఉన్న పుణ్య క్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ వంటి ఆలయాలను కలిసి దర్శించుకున్నారు. ఇక రీసెంట్‌గా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌తో ఈ అమ్మ‌డు ఎక్కువ‌గా టైం స్పెంట్ చేస్తుంద‌ట‌. ఈ ఇద్ద‌రు క‌లిసి య‌శోద చిత్రంలో క‌లిసి న‌టిస్తుండ‌గా, ఎక్క‌డికి వెళ్లిన ఇద్ద‌రు వెళ్ల‌డం ఫుల్‌గా ఎంజాయ్ చేయ‌డం వంటివి చేస్తున్నార‌ట‌.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది