Samantha : నా అత్త చాలా తేడా .. ఆమె వల్ల నరకం అనుభవించా — అమలాపై సమంత షాకింగ్ కామెంట్స్ !!

Authored By aruna | The Telugu News | Published on: August 23, 2023, 9:30 pm

Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య , సమంత రెండేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు విడాకులు తీసుకున్నామన్న విషయం మర్చిపోయి ఎవరి కెరియర్ ను వాళ్ళు చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. కానీ వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా ట్రెండింగ్ అవుతున్న వార్త అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత అఖిల్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. అఖిల్ తర్వాత నాగచైతన్య తల్లి దగ్గుబాటి శ్రీలక్ష్మికి సమంతకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికీ ఇద్దరు కలుసుకుంటూనే ఉంటారట.

సమంత అమెరికాకి వెళ్ళినప్పుడల్లా దగ్గుబాటి లక్ష్మీని కలిసి వెళుతూ ఉంటుందట. అంత మంచి బాండింగ్ ఇద్దరి మధ్య ఉంది. అయితే రీసెంట్గా సమంత, శ్రీలక్ష్మిని కలిసినప్పుడు నాగచైతన్యను తలుచుకొని బాగా ఏడ్చేసిందట. ఆ ఇంట్లో ఉండే మనుషులు మొత్తం విచిత్రమైన వాళ్ళు అంటూ ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో వాళ్లకే తెలియదు అని ఒకానొక సందర్భంలో మా స్వేచ్ఛను మొత్తం పోగొట్టుకొని జైలులో ఉన్నట్లు అనిపించిందని, పెద్ద ఆంక్షలు పెట్టే వారని ముఖ్యంగా అమల పెట్టే కండిషన్స్ నేను తట్టుకోలేకపోయే దానిని.

amantha shcking comments Amala Akkineni

amantha shcking comments Amala Akkineni

అలా నాగచైతన్య కూడా సమంతను అపార్థం చేసుకోవడం మొదలుపెట్టారట. అలా మా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మేము విడిపోవాల్సి వచ్చిందని సమంత ఏడుస్తూ శ్రీలక్ష్మి కి చెప్పుకుందట. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే సమంత విజయ్ దేవరకొండకు జోడిగా ‘ ఖుషి ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. శాకుంతలం సినిమాతో డిజాస్టర్ టాక్ ను అందుకున్న సమంత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఆశిస్తుంది. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఖుషి సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp