Samantha : వాళ్లంతా ప్రేమతో చేస్తారు.. సమంత పోస్ట్ వైరల్

 Authored By sandeep | The Telugu News | Updated on :4 March 2022,6:00 pm

Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ అమ్మ‌డు చేసే సంద‌డి మాములుగా లేదు. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత సమంత ఏ పోస్ట్ చేసిన కూడా తెగ వైర‌ల్ అవుతుంది. ఇటీవ‌ల త‌ను ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొందో సోష‌ల్ మీడియా ద్వారా చెప్పుకొస్తుంది. మోస్ట్ లవబుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య , సమంతలు హఠాత్తుగా తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పినట్లు ప్రకటించి.. అభిమానులతో పాటు.. అందరికీ షాక్ ఇచ్చారు. అయితే తాజాగా సమంత..

తాను నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ‘అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను’ అంటూ ఇటీవ‌ల ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేసింది.2010లో సమంత తొలి చిత్రం ఏ మాయ చేసావే లో చైతన్యతో కలిసి నటించింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. ముద్దుగా అభిమానులు చై సామ్ అని పిలుచుకునేవారు. కొంతకాలం డేటింగ్ చేసిన అనంతరం.. పెళ్లి చేసుకున్నారు. అభిమానులు .. చై, సామ్ లు విడిపోవడాన్ని మొదట జీర్ణించుకోలేదు. కొందరు ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణించారు. సోషల్ మీడియా వేదికగా సమంత, చైతన్యలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమంత విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది.

fell 100 samantha shows love on formersand thought of quitting says samantha

samantha shows love on formers

Samantha : స‌మంత స్ట‌న్నింగ్ పోస్ట్…

అయితే ఏది ఎలా ఉన్నా కూడా స‌మంత త‌న కెరీర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా ముందు సాగుతుంది. సోష‌ళ్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు రైతుల‌కి సంబంధించిన పోస్ట్ ఒక‌టి పెట్టింది. రైతు లు తాజా పండ్లు పండిస్తున్నారు. అవి మ‌న చుట్టు పక్క‌ల అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొంది స‌మంత‌. ఆమె పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉంటే యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుండ‌గా, ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు . కాని ఇప్పుడు ఆమె స్థానంలో వ‌చ్చి చేరింద‌ని టాక్.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి