Sekhar Kammula : కుబేర‌ని హాలీవుడ్ రేంజ్‌లో తీయాల‌ని అనుకున్నాను.. శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sekhar Kammula : కుబేర‌ని హాలీవుడ్ రేంజ్‌లో తీయాల‌ని అనుకున్నాను.. శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్

 Authored By ramu | The Telugu News | Updated on :21 June 2025,4:33 pm

ప్రధానాంశాలు:

  •  Sekhar Kammula : కుబేర‌ని హాలీవుడ్ రేంజ్‌లో తీయాల‌ని అనుకున్నాను.. శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్

Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్ట‌డీగా సాగుతుంటాయి. ఆయ‌న సినిమాల్లో స్టార్ హీరోలు, హీరోయిన్లు కనిపించరు. భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సులు ఉండవు. అయితేనేం ఆయన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. తొలిసారి త‌న కెరీర్ లో నే మొదటి సారి ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా తదితర స్టార్స్ తో కుబేర సినిమాను తెరకెక్కించారు శేఖర్.

Sekhar Kammula కుబేర‌ని హాలీవుడ్ రేంజ్‌లో తీయాల‌ని అనుకున్నాను శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్

Sekhar Kammula : కుబేర‌ని హాలీవుడ్ రేంజ్‌లో తీయాల‌ని అనుకున్నాను.. శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్

Sekhar Kammula : ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ కు ముందు సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శుక్రవారం (జూన్ 20)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుబేర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

సినిమా చూసిన వారందరూ శేఖర్ కమ్ముల టేకింగ్ ను తెగ మెచ్చుకుంటున్నారు. అలాగే ధనుష్, నాగార్జున, రష్మిక ల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ.. కుబేరా అనేది ఒక సాధారణమైన సినిమా కాదు. .. మేము మొదటి నుంచి ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీయాలని అనుకున్నాం, రియల్ లొకేషన్ లో తీయాలి అనుకున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నేను తీసిన సినిమా అన్నింట్లో కుబేర అనేది బెస్ట్ సినిమా అని చెప్పుకొచ్చారు శేఖర్ క‌మ్ముల‌.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది