Sitara : అచ్చం నాన్న మాదిరే క‌ళవాతి సాంగ్‌కి స్టెప్పులేసి నెటిజన్స్ మ‌తులు పోగొడుతున్న‌సితార‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sitara : అచ్చం నాన్న మాదిరే క‌ళవాతి సాంగ్‌కి స్టెప్పులేసి నెటిజన్స్ మ‌తులు పోగొడుతున్న‌సితార‌

 Authored By sandeep | The Telugu News | Updated on :20 February 2022,5:00 pm

Sitara: ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో మహేశ్, కీర్తి సురేశ్ జంటగా రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేశ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. పరశురామ్ దీనిని ఒక పక్కా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటివరకు సర్కారు వారి పాట నుండి ఓ టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా ‘కళావతి’ అనే పాట నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. సినిమాలో ఈ ఒక్క సాంగ్ కోసమే చాలా ఖర్చు అయ్యిందంటూ టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సాంగ్ కి చాలా మంది రీల్స్ చేస్తున్నారు. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఈ పాట‌ని అనుక‌రిస్తూ ర‌చ్చ చేస్తుండ‌గా, ఇప్పుడు ఈ లిస్ట్ లో సితార చేరింది.

తాజాగా క‌ళావ‌తి సాంగ్‌కి స్టెప్పేసి యమ అట్రాక్ట్ చేసింది మహేష్ గారాలపట్టి సితార. ఇందుకు సంబంధించిన వీడియోను నమ్రత శిరోద్కర్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది.’ఇంకా ఏం చెప్పగలను? లవ్ లవ్ లవ్ యూ మై లిటిల్ వన్’ అని ట్యాగ్ చేస్తూ నమ్రత శిరోద్కర్ ఈ వీడియోను పంచుకోవడం స్పెషల్ సర్‌ప్రైజ్‌గా ఫీల్ అవుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఇందులో సితార స్టెప్పులు చూసి ఫిదా అవుతూ ‘వావ్, సూపర్, అమేజింగ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే సోలోగా సితార పిచ్చెక్కిచిందనే చెప్పుకోవాలి. సితార వేసిన స్టెప్పుల‌పై మ‌హేశ్ అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

sitara dance to mahesh Babu kalavathi song

sitara dance to mahesh Babu kalavathi song

Sitara : సితార చిత‌క్కొట్టింది…

కాగా, ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో జీఎంబీ ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ లిరికల్ వీడియోకు 24 గంటల్లోపే మిలియన్లలో వ్యూస్ సాధించింది .అయితే మూవీ టీమ్ అంతా ఈ పాట షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లింది. అయితే ఈ పాట కోసం కనీసం రూ. 40 నుండి 60 లక్షలు ఖర్చు అయిండొచ్చని ఫిల్మ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.సిద్ శ్రీరామ్ ఈ పాట పాడ‌గా, అనంత శ్రీరామ్ లిరిక్స్ రాసారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 12వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ కానుంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది