Sreemukhi : ఇండస్ట్రీపై కన్నేసిన యాంకర్ శ్రీముఖి.. తన అందానికి బ్రేకుల్లేవంట?

Authored By mallesh | The Telugu News | Published on: September 19, 2022, 1:00 pm

Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఇండస్ట్రీలో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోందని తెలుస్తోంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం గ్లామర్ షో పెంచేసింది. బుల్లితర యాంకర్లకు ఏమైందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు ఇలా గ్లామర్ షోస్ చేస్తూ ఇండస్ట్రీలో అవకాశాలు కొట్టేయాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటివరకు అనసూయ, రష్మి, విష్ణుప్రియ టాప్‌లో కొనసాగుతుండగా తాజాగా ఈ లిస్టులోకి యాంకర్ శ్రీముఖి కూడా వచ్చి చేరింది. యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వారుండరు.

ఈ అమ్మడు మొన్నటివరకు పటాస్ షో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె యాంకరింగ్ చేస్తే గలగల గోదావరి పారినట్టు ఉంటుందని ప్రేక్షకులు చెబుతున్నారు. పటాస్ షోను యాంకర్ రవి,శ్రీముఖి కలిసి సంయుక్తంగా చేయగా.. ఈమెకు మంచి పేరు వచ్చింది. శ్రీముఖి ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడిగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బిగ్‌ బాస్‌లో పార్టిసిపేట్ చేశాక శ్రీముఖి పాపులారిటీ మరింత పెరిగింది. దీంతో ఆమెకు ఫ్యాన్ బేస్ కూడా బాగానే పెరిగింది.

Sreemukhi who has an eye on the industry

Sreemukhi who has an eye on the industry

Sreemukhi : ఎద అందాల ప్రదర్శనే ముఖ్యమా..

తన కెరీర్‌లో రెండు నుంచి మూడు సినిమాలు చేసిన శ్రీముఖి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బ్యూటీ సినిమాలతో పాటు సింగింగ్, యాంకరింగ్ కూడా చేస్తుంటుంది. ప్రస్తుతం శ్రీముఖి ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో వస్తున్న ఐకాన్ డ్యాన్స్ షోకు ఓంకార్‌తో కలిసి యాంకరింగ్ చేస్తోంది.దీనికి తోడు సినిమాల్లోనూ నటించాలని ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే అందాల ప్రదర్శనకు తెరలేపింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. లైట్ పింక్ కలర్ దుస్తుల్లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది నిజామాబాద్ బ్యూటీ..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp