Samantha : పుష్పలో సమంత ఐటమ్ సాంగ్‌పై వివాదాలు.. తాజాగా కోర్టుకెక్కిన మరో రాష్ట్రం

Authored By mallesh | The Telugu News | Published on: December 17, 2021, 2:20 pm

Samantha : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీపై అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మొదటి నుంచి ఈ మూవీకి సంబంధించి ఎప్పటి కప్పుడు మూవీ యూనిట్ అప్ డేట్ ఇస్తుండటంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో సమంత ఓ ఐటమ్ సాంగ్ లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లోనే ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది.ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ పాటపై వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఈ పాటలో కొన్ని పదాలు పురుషులను కించపరిచేలా ఉన్నాయంటూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో పురుషులు సంఘం కోర్టును ఆశ్రయించింది. పాటను బ్యాన్ చేయాలని సైతం డిమాండ్ చేసింది. ఇక ఆ వివాదం ముగియక ముందే ఆ పాటపై మరి కొందరు కోర్టు కెక్కారు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించడంతో పుష్ప యూనిట్ లో కాస్త టెన్షన్ మొదలైనా.. దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఈ పాటలో మగవారిని కించపరిచే పదాలున్నాయంటూ తమిళ‌నాడుకు చెందిన పురుషుల సంఘం ఏపీలోని చిత్తూరులో కోర్టును ఆశ్రయించింది.

tamils ​​resorting to court over samantha item-song

tamils ​​resorting to court over samantha item-song

Samantha : తాజాగా తమిళనాడు వంతు..

ఇదిలా ఉండగా ఈ పాట మాత్రం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 20 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. ఈ పాటలోని మాస్ బీట్ ప్రతి ఒక్కరితో స్టెప్పులు వేయిస్తోంది. ఇక భారీ అంచనాల మీద ఈ మూవీ నేడే రిలీజ్ కావడం విశేషం. భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ ఇక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే థియేటర్స్‌కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించగా, మంగళం శ్రీను క్యారెక్టర్ లో సునీల్ యాక్ట్ చేశాడు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp