Samantha : సమంత దారుణ వ్యాధి గురించి బయటపడిన కొన్ని రోజుల్లోనే ఇండస్ట్రీలో మరొక బిగ్ న్యూస్ .. సరిగ్గా అదే వ్యాధి తో !

Authored By Rame Samhith | The Telugu News | Published on: November 5, 2022, 7:00 pm

Samantha : సిల్వర్ స్క్రీన్ మీద అందంగా కనిపించే చాలామంది తారల వెనక జీవితాలు ఎన్నో ఇబ్బందిలు ఎదుర్కుంటూ ఉంటారు. తమకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆడియన్స్ ని అలరించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో సమంత బయట పెట్టిన మయోసైటిక్స్ వ్యాధి అందరికి షాక్ ఇచ్చింది. సమంత మయోసైటిక్స్ వల్ల బాధపడుతుంది అని అనగానే అసలు ఈ వ్యాధి ఏంటి ఎందుకు ఇది వస్తుంది అన్న దాని మీద వెతకడం మొదలు పెట్టారు. అయితే ఇలానే ఇంతవరకు ఎవరికీ తెలియని వ్యాధితో మరో దర్శకుడు బాధపడుతున్నట్టు తెలుస్తుని. ఇంతకీ ఎవరా దర్శకుడు అతనికున్న సమస్య ఏంటి అంటే..

జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ కెవి అని తెలుస్తుంది. ఈ యంగ్ డైరక్టర్ కూడా తనకున్న సమస్య గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఇంతకీ అతనికున్న సమస్య ఏంటి అంటే హైలీ సెన్సిటివ్ పర్సన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడట. అదేంటి అంటే ఇది కూడా ఒక రోగమని.. తనలాంటి వారు చాలామంది ఉన్నారని చెప్పాడు అనుదీప్. తనకు గ్లూటెన్ పడదని.. కాఫీ తాగితే రెండు రోజులు నిద్ర పట్టదని.. ఏవైనా జ్యూస్ తాగితే మాత్రం మైండ్ కాం అవుతుందని అన్నారు. ఈ వ్యాధి ఉన్న వారికి సెన్సెస్ చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయని అన్నారు. లైటింగ్ ఎక్కువ చూసినా.. ఘాటైన వాసనలు పీల్చినా తట్టుకోవడం కష్టమని..

tollywood star director suffering with decease after samantha

tollywood star director suffering with decease after samantha

ఇలాంటి వారు త్వరగా అలసిపోతారని అన్నారు. మరి ఈ డైరక్టర్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. రోజులో ఒకసారి మాత్రమే వండిన ఆహారం తీసుకుంటానని.. తర్వాత రా ఫుడ్ తింటానని చెప్పారు. మరి ఇంత చిన్న ఏజ్ లో అనుదీప్ కెవికి ఉన్న ఈ సమస్య తెలిసి అందరు షాక్ అవుతున్నారు. ఇంత బాధ ఉన్నా అనుదీప్ తన సినిమాలతో అలరిస్తున్నారు. సినిమాలే కాదు అనుదీప్ ఇంటర్వ్యూస్ కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. అతని వ్యాధి గురించి ఆడియన్స్ అంతా షాక్ అవుతున్నారు.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp