Upasana : పవన్ కళ్యాణ్ జనసేన కోసం రంగంలోకి దిగిన ఉపాసన ..

Authored By Admin | The Telugu News | Updated on : 4 August 2023, 9:08 pm

Upasana : తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే అభిమానులు ఎంత హడావిడి చేస్తారో అందరికీ తెలిసిందే. అలాంటిది ఆయన పాలిటిక్స్ లో దిగారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు పాలిటిక్స్ చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ స్థాపించి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్లారు. గతంలో తన అన్నయ్య చిరంజీవి కూడా పార్టీని స్థాపించి రాజకీయాలు చేశారు కానీ ఆయనకు అంతగా వర్కౌట్ కాలేదు దీంతో మళ్ళీ సినిమాల వైపు వచ్చారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలని కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా మెగా కోడలు ఉపాసన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం రంగంలోకి దిగారని న్యూస్ వైరల్ అవుతుంది. దీని గురించి అభిమానులు తెలుసుకొని షాకింగ్ అవుతున్నారు. మెగా కోడలు ఉపాసన నిర్ణయానికి అందరూ గౌరవిస్తారు. ఉపాసన కోట్లాది ఆస్తికి అధిపతిరాలు. అలాగే మెగా ఫ్యామిలీకి ఒక చక్కటి కోడలు. ఉపాసన అందరి గురించి ఆలోచిస్తుంది.

Upasana join to Pawan Kalyan Janasena party

Upasana join to Pawan Kalyan Janasena party

తన భర్త రామ్ చరణ్ గురించి కూడా ఎంతో ఆలోచిస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం రంగంలోకి దిగారట. మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని ప్రచారం చేయాలని అనుకుంటున్నారట. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలని ఉపాసన సూచించింది. అలాగే అల్లు అర్జున్ కూడా ఈ యాత్రలో పాల్గొనాలని ఉపాసన సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కి అండగా మెగా ఫ్యామిలీ జనసేన పార్టీ కోసం రంగంలో దిగినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి