Rashmika Mandanna : పాపం రా రష్మిక ఏం తప్పు చేసింది.. ఎందుకు తన జీవితం నాశనం చేస్తున్నారు !

Authored By Breaking News | The Telugu News | Published on: May 10, 2023, 11:46 am

Rashmika Mandanna : 2021లో వచ్చిన “పుష్ప” సినిమాతో రష్మిక మందన నేషనల్ క్రష్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… అభిమానులకు తన పర్సనల్ విషయాలు తెలియజేసే ఇటీవల చిట్ చాట్ లో తాను వెజిటేరియన్ అని చెప్పుకొచ్చింది. కొన్ని కారణాలవల్ల వెజ్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నట్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే రష్మిక చేసిన ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు.

రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసేదొకటి అని కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా ఈమె మేక్ డోనాల్డ్ ప్రకటన కోసం నాన్ వెజ్ బర్గర్ తిన్నట్లుగా చూపించారు. అది కాస్త వైరల్ అయింది. ఆ వీడియో బుల్లితెరపై టెలికాస్ట్ అవుతూ ఉంది. వెబ్ మీడియా ఇంకా యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియోలో రష్మిక చికెన్ తినటం చూసి చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. నువ్వు గతంలో నాన్ వెజ్ నీ మానేస్తానన్నావు మరి ఇది ఏంటి అని.. ప్రశ్నిస్తున్నారు.

Rashmika Mandanna latest photo shoot video viral in instagram

Rashmika Mandanna latest photo shoot video viral in instagram

డబ్బు కోసం పచ్చి అబద్దాలు చెప్పే రష్మిక అంటూ పాత వీడియోలను స్క్రీన్ షాట్స్ పెట్టి మరి వీడియో షేర్ చేసి పరువు తీసేస్తున్నారు. ఆమె జీవితం నాశనం అయ్యేలా.. ఆమె కొచ్చిన పేరు చెడగొట్టేలా మరి దారుణంగా సోషల్ మీడియాలో ఈ నాన్ వెజ్ విషయంలో నేషనల్ క్రష్ రష్మికని ట్రోలింగ్ చేస్తున్నారు. మరోపక్క ఈ ట్రోలింగ్ పై రష్మిక అభిమానులు పాపం రా ఇందులో ఆమె తప్పేముంది. యాడ్ చేయటంలో ఇదొక భాగం. అందులో చికెన్ ఫుల్లుగా తిన్నట్టు.. ఎక్కడా లేదు ఆమె నోటి దగ్గర పెట్టుకోవడం మాత్రమే ఉంది అంటూ కవర్ చేసుకోస్తున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp