Veera Simha Reddy : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులకు అందరికీ ఇవాళ్టి నుంచే సంక్రాంతి పండుగ ప్రారంభం అయింది. అది బాలయ్య సినిమాతో. నిజానికి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా థియేటర్లలోకి రావాల్సిందే. బాలకృష్ణ అభిమానులు ముందే సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిందే. తాజాగా అదే జరిగింది. ఈసారి కూడా వీరసింహారెడ్డి పేరుతో బాలకృష్ణ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నిజానికి ఇది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా. బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ సినిమాను అభిమానులు ఎప్పటి నుంచో కావాలని కోరుతున్నారు. చివరకు వీరసింహారెడ్డి ద్వారా బాలకృష్ణ మళ్లీ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాలో నటించగలిగారు. ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. పైగా అఖండ తర్వాత బాలయ్య బాబు నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే.. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమాకు అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ బిజినెస్ హయ్యెస్ట్ అని చెప్పుకోవాలి. తెలంగాణ, ఏపీ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు రూ.61.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.73 కోట్ల బిజినెస్ జరిగింది. నిజానికి.. అఖండ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెసే జరిగింది. కానీ.. ఇప్పుడు వీరసింహారెడ్డికి మాత్రం అదనంగా రూ.13 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే.. ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే.. కనీసం రూ.74 కోట్ల షేర్ రావాలి. ఈ షేర్ వచ్చిందటే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నట్టే.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.