Ys Jagan : ఇది 2023. ఇంకో సంవత్సరంనరలో ఏపీలో ఎన్నికలు రానున్నాయి. దాని కోసం ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ నేత నారా లోకేశ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు. ఈనెల 27 నుంచే చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని నారా లోకేశ్ డిసైడ్ అయ్యారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర పేరుతో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. అయితే.. రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల వేళ ఇలా యాత్రలను ప్రారంభిస్తే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి మైనస్ అవుతుంది.
దీంతో తాజాగా ఏపీలో రోడ్లపై ర్యాలీలు, సమావేశాలు, సభలను నిర్వహించకుండా వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. నేషనల్ హైవేల మీద కానీ.. రాష్ట్ర రహదారుల మీద కానీ, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్ల మీద కానీ ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. అయితే.. ఇటీవల కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఏ పార్టీ కూడా తాజా నిషేధం వల్ల ఏ రోడ్డుపై కూడా సభ పెట్టే అవకాశం ఉండదు. నిజానికి.. రోడ్ల మీద షోలు చేయడం వల్ల.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నిర్వహణ లోపాల వల్ల కూడా ప్రజల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఏపీ వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. పోలీసులు ప్రత్యేక పర్మిషన్ ఇస్తే సభలు నిర్వహించుకోవచ్చు. సభకు ముందే పోలీసులను సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలి. సభకు ఎంత మంది వస్తున్నారు. సభ ఉద్దేశం అన్నీ పరిశీలించి పోలీసులే సభకు అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు. అయితే.. ఇదంతా కావాలని ప్రతిపక్షాల పాదయాత్రలను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిషేధం అంటూ ప్రతిపక్షాలు ఓవైపు గగ్గోలు పెడుతున్నాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.