Piyush Goyal: హైదరాబాద్ నగర పేరును మారుస్తామని కమలనాథులు ఎప్పటినుంచో చెబుతున్న మాట. దేశంలో ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లిం పేరుతో ఉన్న కొన్ని నగరాలు, పట్టణాల పేర్లను మార్చారు. తెలంగాణ బీజేపీ నేతలతో పాటు కేంద్రం నేతలు కూడా హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని చెబుతున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరానికి చేరుకున్న కేంద్రమంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అందరితో చర్చించి నగరపేరును భాగ్యనగరంగా మార్చుతామని అన్నారు.
దేశంలో ఇప్పటికే ఔరంగాజేబ్ రోడ్డు, అలహాబాద్, ఫైజాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ వంటి నగరాల పేరును మార్చేశారు. ఇప్పుడు ఇదే వరుసలో హైదరాబాద్ ను చేర్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పియుష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా మద్దతు తెలిపారు. నగరంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల అనంతరం కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చి తీరుతామని అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.
దీనికి కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా పలికితే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో ఉన్న పేరే కదా… చాలా రాష్ట్రాలకు గతంలో ఒకపేరు ఉంటే ఇప్పుడు మరో పేరుతో పిలవడం లేదా.. అన్నారు. హైదరాబాద్ నగరం సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఇచ్చిన గిఫ్ట్ అని గుర్తుచేశారు. పటేల్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ మోడీ ప్రభుత్వం గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.